ఢిల్లీలో రైతుల పోరాటానికి మహిళల మద్దతు..స్వయంగా ట్రాక్టర్లు నడుపుకుంటూ వస్తున్న మహిళలు

వ్యవసాయ చట్టాల రద్దే లక్ష్యంగా వంద రోజులకు పైగా ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా నేడు మహిళలు సంఘీభావం ప్రకటించనున్నారు. హర్యానా, పంజాబ్‌ నుంచి వేలాది మహిళలకు స్వయంగా ట్రాక్టర్లు నడుపుకుంటూ ఢిల్లీకి పయణమయ్యారు.

ఢిల్లీలో రైతుల పోరాటానికి మహిళల మద్దతు..స్వయంగా ట్రాక్టర్లు నడుపుకుంటూ వస్తున్న మహిళలు

Women’s support for the farmers struggle : వ్యవసాయ చట్టాల రద్దే లక్ష్యంగా వంద రోజులకు పైగా ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా నేడు మహిళలు సంఘీభావం ప్రకటించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీ సరిహద్దులో రైతుల దీక్షకు మద్దతుగా నిరసన ప్రకటించేందుకు పెద్ద ఎత్తున మహిళలు ఛలో ఢిల్లీ అంటున్నారు.

హర్యానా, పంజాబ్‌ నుంచి వేలాది మహిళలకు స్వయంగా ట్రాక్టర్లు నడుపుకుంటూ ఢిల్లీకి పయణమయ్యారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతుల దీక్ష స్థలి వద్దే ప్రత్యేక వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. పంజాబ్‌, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది మహిళలకు రైతులకు మద్దతు తెలిపేందుకు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటారని రైతు సంఘాల నేతలు తెలిపారు.

సింఘు, ఘాజీపూర్‌, టిక్రీలలో కొనసాగుతున్న రైతు దీక్ష శిబిరాలకు వారంతా చేరుకుంటారన్నారు. నిరసనలో పాటు వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర అనే అంశంపై దీక్షా స్థలిలో సదస్సు నిర్వహిస్తామంటున్నారు రైతు సంఘాల నేతలు.

ఈ రోజు జరిగే రైతు దీక్షలో అన్నింటా మహిళా రైతులే ముందుంటారు. ధర్నాలు, నిరసనలు, ప్రసంగాలు అన్ని మహిళా రైతులే చేస్తారు. సింఘు సరిహద్దులో మహిళా రైతులతో ర్యాలీ కూడా నిర్వహిస్తామంటున్నారు నేతలు. మరోవైపు మహిళలు పెద్ద ఎత్తున దీక్షా స్థలికి వస్తుండటంతో పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహిళా పోలీసులకు పెద్ద సంఖ్యలో ఢిల్లీ సరిహద్దులకు తరలిస్తున్నారు.