రెజ్లర్ సుశీల్ కుమార్ ఎక్కడున్నాడో చెప్తే లక్ష రూపాయల రివార్డు

రెజ్లర్ సుశీల్ కుమార్ ను పట్టిచ్చినా.. ఆచూకీ తెలియజేసినా లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు ఢిల్లీ పోలీసులు. న్యూ ఢిల్లీలో ఛత్రసల్ స్టేడియం పార్కింగ్ ప్రదేశంలో జాతీయ జూనియర్ మాజీ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ రానా హత్యలో సుశీల్ కుమార్ పాత్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు.

రెజ్లర్ సుశీల్ కుమార్ ఎక్కడున్నాడో చెప్తే లక్ష రూపాయల రివార్డు

Susheel Kuamr

Sushil Kumar: రెజ్లర్ సుశీల్ కుమార్ ను పట్టిచ్చినా.. ఆచూకీ తెలియజేసినా లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు ఢిల్లీ పోలీసులు. న్యూ ఢిల్లీలో ఛత్రసల్ స్టేడియం పార్కింగ్ ప్రదేశంలో జాతీయ జూనియర్ మాజీ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ రానా హత్యలో సుశీల్ కుమార్ పాత్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు.

కేసుకు సంబంధం ఉంది కాబట్టే పరారీలో ఉన్నాడని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తి అజయ్ ను పట్టిస్తే రూ.50వేలు ఇస్తామని రివార్డు ప్రకటించారు. అంతకంటే ముందు ఢిల్లీ కోర్టు 23ఏళ్ల నిందితుడికి ఉన్న సంబంధంపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది.

మే4న జరిగిన గొడవలో చాలా మంది రెజ్లర్లకు గాయాలయ్యాయి. ట్రీట్మెంట్ అందిస్తుండగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మే5న తనపై వచ్చిన ఆరోపణలను సుశీల్ తోసిపుచ్చాడు. ఆ ఫైట్ లో తన రెజ్లర్లు ఇన్వాల్వ్ అయి లేరని… అది ఛత్రసాల్ స్టేడియంలో లోపల జరిగిందని చెప్పాడు.

రెజ్లర్ సుశీల్ ఇండియాలో సక్సెస్ అయిన అథ్లెట్లలో ఒకరు. 2012 లండన్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ అందుకున్నాడు. అంతకంటే నాలుగేళ్ల ముందు జరిగిన బీజింగ్ ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నాడు.