యోగి ఆదిత్యనాథ్ కుక్క కూడా సెలబ్రిటీనే

యోగి ఆదిత్యనాథ్ కుక్క కూడా సెలబ్రిటీనే

కుక్కలకు కూడా సెలబ్రిటీ హోదా దక్కేస్తుంది. కొన్నేళ్లుగా కుక్కలకు, పిల్లులకు ఇనిస్టాగ్రామ్ అకౌంట్లు ఓపెన్ చేసి హైప్ తీసుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పెంపుడు కుక్కకు సెలబ్రిటీ హోదా దక్కేసింది. ఆదిత్యనాథ్‌తో కలిసి దిగిన ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. కలూ అని ముద్దుగా పెంచుకునే బ్లాక్ లాబర్డర్ బ్రీడ్ కుక్క ఫొటోలు వైరల్ గా మారడానికి కారణమేమిటంటే..

సోమవారం ముఖ్యమంత్రిని చూసి ప్రేమగా పైకి ఎక్కింది. దానికి పన్నీర్ ముక్కలు తినిపిస్తుండగా తీసిన ఫొటో సోషల్ మీడియాకి పాకింది. డిసెంబరు 2016వ సంవత్సరంలో గోరఖ్‌పూర్‌లోని గోరక్షక్ టెంపుల్‌లో ఉన్నప్పుడు ఆదిత్యనాథ్‌కు ఓ భక్తుడు కుక్కను బహుమతిగా ఇచ్చాడు. అంతకుముందు సీఎం దగ్గర రాజాబాబు అనే కుక్క ఉండేదట. అది చనిపోవడంతో దాని స్థానంలో కలూ వచ్చింది. 

కలూ పూర్తి వెజిటేరియన్. పాలు, రొట్టెలనే ఆహారంగా తీసుకుంటుంది. లేదంటే గుడిలో చేసిన ప్రసాదమే తింటుంది. ఆదిత్యనాథ్ లేని సమయంలో హిమాలయ గిరి అనే వ్యక్తి దాని యోగక్షేమాలు చూసుకుంటాడు. వాతావరణానికి తట్టుకునేలా ఆ కుక్కకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. ఆదిత్యనాథ్ వచ్చినప్పుడల్లా ఆ కుక్క పైకి ఎక్కేస్తుంటుందని స్థానికులు చెబుతుంటారు.