తలకు 18 తలలు తెగిపడాల్సిందే..నా రెండో కొడుకుని కూడా ఆర్మీకి పంపుతా..
చైనా లడఖ్లోని గాల్వన్ లోయలో భారత్ ఆర్మీపై చైనా చేసిన దాడిలో చనిపోయిన వీర సైనికులకు భారతదేశమంతా ఘననివాళులు అర్పిస్తోంది. డ్రాగన్ దేశానికి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తోంది. చైనా దాడిలో చనిపోయిన భారత జవానుల్లో బిహార్ అమరుడు హవల్దార్ అమన్ కుమార్ సింగ్ కూడా ఒకరు. కొడుకును పోగొట్టుకున్న అమన్ కుమార్ సింగ్ కుటుంబం దు:ఖంతో కన్నీరుమున్నీరవుతోంది.
అంతటి ఆవేదనను కడుపులో దాచుకుని ‘‘నాకొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు..అందుకు మాకు చాలా గర్వంగా ఉంది..కొడుకు మరణంతో మేము ఏమాత్రం తగ్గేది లేదు..చైనాకు తగిన గుణపాఠంనేర్పాలి…భారత జోలికి వస్తే ఎటువంటిపరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందోనని తెలియజెప్పాలి.
అందుకోసం నా రెండవ కొడుకుని కూడా సైన్యంలోకి పంపిస్తానంటూ బిహార్ అమరుడు హవల్దార్ అమన్ కుమార్ సింగ్ తండ్రి సుధీర్ కుమార్ భావోద్వేగంతోచెప్పారు. ‘నా బిడ్డ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. చైనా చేష్టలకు నాకే పట్టరానంత ఆగ్రహం ఉంది…మన 20 మంది సైనికుల వీర మరణాలకు ప్రతీకారం తీర్చుకోవాలి. ఒక్కో తలకు ప్రతిఫలంగా 18 తలలు తెగిపడాలి.
దేశరక్షణ కోసం నా రెండు కొడుకు కూడా సిద్ధం చేస్తానంటూ ప్రతీ భారతీయుడి రోమాలు నిక్కబొడుకునేలా మాట్లాడారు..’ అని అన్నారు. 25 సంవత్సరాల అమన్ కుమార్ బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలోని మొహియుద్దీన్ నగర్లోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందినవాడు. 2014లో ఆర్మీలో చేరిన అమన్ బీహార్ రెజిమెంట్ లో చేరాడు. కు 2019లోనే వివాహం అయ్యింది.
ఒక సంవత్సరం క్రితం ఫిబ్రవరిలో లేహ్-లడఖ్ ప్రాంతానికి పంపిచబడ్డాడు. అలా అక్కడికి వెళ్లిన తరువాత అమన్ ఒక్కసారి మాత్రమే ఇంటికి వచ్చి 8 రోజులు ఉండి వెళ్లాడని ఇంతలోనే ఈ మరణవార్త వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
కొడుకు మరణవార్త విన్న అమన్ తల్లి రేణుకాదేవి మాట్లాడుతూ..జూన్ 2న చివరిసారిగా నాతో నాకొడుకు మాట్లాడాడని..జూలై నెలలో ఇంటికొస్తానమ్మాఅని తనకొడుకు చెప్పాడనీ..కానీ ఇంతలోనే ఇటువంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఒక పెళ్లై ఒక్క సంవత్సరంకూడా పూర్తికాకుండానే భర్త దూరమైనందుకు అమన్ భార్య ఆవేదన గురించి ఎంత చెప్పినా తక్కువే. భర్త వచ్చే నెలలో వస్తాడని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఆమెకు భర్త ఇక రాడని తెలిసి గుండెలవిసేలా రోదిస్తోంది.
Read: 30 గంటల తర్వాత..మహిళ ఛాతిలో చాకు తొలగింపు..ఎలా భరించిందో