రెచ్చిపోయిన ప్రేమ జంట : మెట్రో రైలులో హాట్ హాట్ రొమాన్స్

  • Published By: madhu ,Published On : December 8, 2019 / 03:22 AM IST
రెచ్చిపోయిన ప్రేమ జంట : మెట్రో రైలులో హాట్ హాట్ రొమాన్స్

మెట్రో రైలులో ప్రేమ జంటలు రెచ్చిపోతున్నాయి. అందరూ చూస్తున్నారనే సంగతి మరిచి… కౌగిలింతలు, ముద్దులతో పరవశించి పోతున్నాయి. సీసీ కెమెరాలు ఉంటాయని తెలిసినా.. పబ్లిక్‌గా రెచ్చిపోతుండడంతో తోటి ప్రయాణికులు షాక్ తింటున్నారు. కొంతమంది వీటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తోటి ప్రయాణికులు చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించిందో ఓ జంట. 

ఈ ఘటన మెట్రో రైల్లో జరిగింది. కౌగిలింతలు, ముద్దులతో హల్ చల్ చేశారు లవర్స్. పట్టపగలు…సోయి లేకుండా.. రొమాన్స్‌లో మునిగిపోయారు. ఇద్దరి బాగోతాన్ని రహస్యంగా చిత్రీకరించాడు ఓ ప్యాసింజర్. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. దీనిపై ఢిల్లీ మెట్రో రైలు అధికారులు స్పందించారు. జంటను గుర్తించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మెట్రోలో ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. కానీ కుర్రకారికి మెట్రో హాట్ స్పాట్‌గా మారిపోతోంది. కాసింత ఏకాంతం దొరుకుతుందా..అని ఎదురు చూసే లవర్స్..తమ అవసరానికి ఉపయోగించుకుంటున్నారు. వీరి చేష్టల వల్ల తోటి ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. 
Read More : ఉడుకుతున్న ఉన్నావ్ : రేపిస్టులను ఎన్ కౌంటర్ చేయాలి