కరోనా సెకండ్ వేవ్.. స్విగ్గీ, జొమాటో సేవలు బంద్..

కరోనా సెకండ్ వేవ్.. స్విగ్గీ, జొమాటో సేవలు బంద్..

Zomato Swiggy Stop Deliveries After 8pm In Maharashtra After New Lockdown Restrictions

కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. మహారాష్ట్రలో ప్రస్తుతం మునుపటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కునుకులేకుండా చేస్తుంది. మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌లో తీవ్ర ఇబ్బందులు పడగా.. ఇప్పుడు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మాత్రమే లాక్‌డౌన్‌ అమలు చేస్తుంది ప్రభుత్వం. లేటెస్ట్‌గా వారాంతాల్లో (శని, ఆదివారం) పూర్తి లాక్‌డౌన్‌ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టేవరకు ఫుడ్‌ డెలివరీ సంస్థల సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో రాత్రి 8 గంటల తర్వాత తాము డోర్ డెలివరీ చేయలేమని జొమాటో, స్విగ్గీ సంస్థలు ప్రకటించింది. వినియోగదారులకు ఈ విషయాన్ని ఓ నోటిఫికేషన్ ద్వారా పంపాయి సదరు సంస్థలు. రాత్రి 8 నుంచి ఉదయం 7గంటల వరకు మినీ లాక్‌డౌన్‌ విధించడంతో ఆయా సంస్థలు తమ సేవల సమయాన్ని కూడా మార్చేశాయి.