Home » ఉపాసన విడుదల చేసిన ‘నాట్యం’ ఫస్ట్ లుక్
Published
1 month agoon
Natyam: హైదరాబాద్కు చెందిన సుప్రసిద్ధ కుచిపూడి డ్యాన్సర్ సంధ్య రాజు మొదటిసారిగా ఒక తెలుగు సినిమాలో నటించారు. ఆమె తన నటన, ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్ ద్వారా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, పరోపకారి ఉపాసన కొణిదెల ‘నాట్యం’ ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ ఫస్ట్లుక్ పోస్టర్లో సాంప్రదాయ చీర కట్టుతో క్లాసికల్ డ్యాన్సర్గా సంధ్య రాజు తన పాత్రలో ఒదిగిపోయారు. వెనక అలంకరించిన నటరాజు విగ్రహం ముందు ఆమె ఒక నాట్య దేవతలా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ఈ చిత్రంలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలని ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ మూవీ ద్వారా రేవంత్ కొరుకొండ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించడంతో పాటు డిఓపి, ఎడిటర్ కూడా అతనే.. ఈ చిత్రం ఒక గురుశిష్యుల మధ్య ఒక అందమైన ప్రత్యేకమైన సంబంధాన్ని చిత్రీకరిస్తుంది. అలాగే ఒక మంచి ప్రేమకథతో ముడిపడి ఉంది. కమల్ కామరాజు, రోహిత్ బెహల్ కీలక పాత్రల్లో నటించారు.
శ్రవణ్ భరద్వాజ్ అందమైన సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం దక్షిణ భారతదేశంలోని హంపి, లేపాక్షి, బెంగళూరు మరియు హైదరాబాద్లోని అందమైన ఆర్కిటెక్ట్ దేవాలయాలలో విజువల్ బ్యూటీగా నిర్మించబడింది. ఆధిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ, బేబి దేవన ఇతర పాత్రల్లో నటించారు.