Viral Video: ఒకే బైక్పై ఏడుగురు కుటుంబ సభ్యులు.. ముక్కున వేలేసుకుంటున్న నెటిజెన్లు
ఈ వీడియోను సుప్రియా సాహు అనే ఐఏఎస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘స్పీచ్లెస్’ అని ట్వీట్ చేశారు. కాగా, ఈ వీడియోను ఇప్పటికే 2 మిలియన్ల మంది చూశారు. తమ జీవన ప్రయాణంలో సామాన్యులు ఎన్ని కష్టాలు పడతారో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు తెలుసుకోవచ్చని, ఎంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైనా సరే.. మరీ ఇంత రిస్కీ పనులు చేయొద్దంటూ కొందరు వీడియోపై స్పందిస్తున్నారు.
Viral Video: ఒక బైక్పై ఇద్దరు వెళ్లాలనేది నిబంధన. అయినా కూడా ఒక్కోచోట ముగ్గురు వెళ్తుంటారు. మరీ ఎక్కువైతే ఎక్కడో ఒక చోట నలుగురు వ్యక్తులు బైక్పై కనిపిస్తుంటారు. కానీ ఒక బైక్పై ఏకంగా ఏడుగురు ప్రయాణించారంటే నమ్మగలరా? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో చూస్తే మీరు నమ్మక తప్పదు. ఈ వీడియో చూస్తూ నెటిజెన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరేమో మామూలు ఫీట్ కాదంటూ ఆశ్చర్యపోతుండగా, మరికొందరేమో జరగబోయే ప్రమాదాల గురించి ఆందోళన చెందుతున్నారు.
వీడియో ప్రకారం.. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. ముందుగా ఒక వ్యక్తి బైక్పై కూర్చోగా.. ఇద్దరు పిల్లలు ఆయన ముందున్న పెట్రోల్ ట్యాంకుపై కూర్చున్నారు. అప్పటికే మరో ఇద్దరు పిల్లలు
సహా ఇద్దరు మహిళలు బైక్ పక్కన ఎదురు చూస్తున్నారు. అనంతరం ఒక మహిళ బైక్ ఎక్కింది. ఆమెకు ఒక చిన్నారిని అందించిన మరో మహిళ.. తన చంకలో మరో చిన్నారిని ఎత్తుకుని ఆమె కూడా బైక్ ఎక్కింది. ఇలా బైక్పై ఏకంగా ఏడుగురు ఎక్కారు. వీరిలో ఏ ఒక్కరికి హెల్మెట్ కూడా లేకపోవడం మరో విశేషం.
Speechless ? pic.twitter.com/O86UZTn4at
— Supriya Sahu IAS (@supriyasahuias) August 30, 2022
ఈ వీడియోను సుప్రియా సాహు అనే ఐఏఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘స్పీచ్లెస్’ అని ట్వీట్ చేశారు. కాగా, ఈ వీడియోను ఇప్పటికే 2 మిలియన్ల మంది చూశారు. తమ జీవన ప్రయాణంలో సామాన్యులు ఎన్ని కష్టాలు పడతారో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు తెలుసుకోవచ్చని, ఎంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైనా సరే.. మరీ ఇంత రిస్కీ పనులు చేయొద్దంటూ కొందరు వీడియోపై స్పందిస్తున్నారు.
Money Laundering Case: బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్కు సమన్లు పంపనున్న ఢిల్లీ కోర్టు