Home » భారత్ మార్కెట్ పై ఫైజర్ దృష్టి…వ్యాక్సిన్ విడుదలపై కేంద్రంతో చర్చలు
Published
2 months agoon
By
bheemrajPfizer Corona Vaccine : భారత్ మార్కెట్ పై ఫైజర్ దృష్టి పెట్టింది. కరోనా వ్యాక్సిన్ విడుదలపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. స్టోరేజ్ ఫెసిలిటీతో ఇబ్బందులు లేవని ఫైజర్ చెప్పింది. వ్యాక్సిన్ ఖరీదు రూ.2,950, రూ.3,700 మధ్య ఉండే ఛాన్స్ ఉంది. భారత ప్రభుత్వం ప్రీ ఆర్డర్ కుదుర్చుకోలేదు. ఇప్పటికే వివిధ దేశాలు కోట్ల డోసులకు ఆర్డర్లు ఇచ్చాయి. అమెరికా 10 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చింది. యూరోపియన్ యూనియన్ 20 కోట్ల డోసులకు ఒప్పందం కుదుర్చుకుంది.
ఫైజర్ వ్యాక్సిన్ కు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వచ్చే వారం డిసెంబర్ 7 నుంచి వ్యాక్సిన్ బ్రిటన్లోని ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. ముందుగా వైద్య సిబ్బంది, 80ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు.
కరోనా వ్యాక్సిన్ కు లైసెన్స్ పొందిన మొదటి వెస్టరన్ కంట్రీగా యూకే అవతరించింది. ఫైజర్/బయోటెక్ వ్యాక్సిన్ ను ఇప్పటివరకూ డ్రగ్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ అథారిటీ (MHRA)తో అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది.
జనవరి 1 ముందు ప్రత్యేక నిబంధనల కింద ప్రభుత్వానికి MHRA అధికారాన్ని ఇచ్చింది. రష్యా తర్వాత కరోనా వ్యాక్సిన్కు యూకే ఆమోదం తెలిపింది. యూకేలో పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. రాబోయే రోజుల్లో తొలి డోస్ వ్యాక్సిన్ అందించనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇప్పటివరకూ యూకే మొత్తం 40 మిలియన్ల డోస్ లను కొనుగోలు చేసింది. ఫైజర్ వ్యాక్సిన్ తుది ట్రయల్ ఫలితాల్లో వ్యాక్సిన్ 95 శాతం కన్నా ఎక్కువగా ప్రభావవంతంగా పని చేస్తుందని నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.