Bharat Jodo Yatra: ఢిల్లీకి చేరిన రాహుల్ భారత్ జోడో యాత్ర .. పాల్గొన్న సోనియా, ప్రియాంక సహా ప్రముఖులు
Bharat Jodo Yatra: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం ఢిల్లీకి చేరింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీ నగర వీధుల్లో యాత్ర ఉత్సాహంగా సాగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ కు ఘన స్వాగతం పలికి.. ఆయన వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు కాంగ్రెస్ అగ్రనాయకత్వం యాత్రలో పాల్గొనగా.. కమల్ హాసన్, పలువురు ప్రముఖులుసైతం రాహుల్ తో కలిసి నడిచారు. ఎర్రకోట వద్ద జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేంద్రంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో పాలన సాగడం లేదని, అంబానీ, అదానీ కనుసన్నల్లో పాలన సాగుతుందని రాహుల్ విమర్శించారు.