Rahul Gandhi Bharat Jodo Yatra: హర్యానాలో ఉత్సాహంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. ఫొటో గ్యాలరీ
Rahul Gandhi Bharat Jodo Yatra: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం హర్యానాలో కొనసాగింది. గత గురువారం సాయంత్రం పానిపట్ మీదుగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హర్యానాలోకి ప్రవేశించింది. అయితే, మంగళవారం అంబాలా కాంట్లోని షాంపూర్ నుంచి రాహుల్ పాదయాత్ర మొదలైంది. ఎముకలు కొరికే చలినిసైతం లెక్కచేయకుండా రాహుల్ వెంట భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు యాత్రలో పాల్గొన్నారు. మంగళవారంతో హర్యానాలో రాహుల్ యాత్ర ముగిస్తుంది. రాత్రికి పంజాబ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఇదిలాఉంటే పంజాబ్లో యాత్రను ప్రారంభించడానికి ముందు రాహుల్ గాంధీ అమృత్ సర్లోని స్వర్ణ దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయనున్నారు.