కోవిడ్‌ చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ. 1000 కోట్లు… ఇప్పుడు రోజుకు రూ.6.5 కోట్లు ఖర్చు

  • Published By: sreehari ,Published On : July 24, 2020 / 02:21 PM IST
కోవిడ్‌ చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ. 1000 కోట్లు… ఇప్పుడు రోజుకు రూ.6.5 కోట్లు ఖర్చు

కరోనా చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు రోజుకు రూ.6.5 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు కోవిడ్‌ సమీక్షా సమావేశంలో జగన్ వెల్లడించారు.

కోవిడ్‌ చికిత్సకోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ. 1000 కోట్లు
మందులు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది కోసం ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. వచ్చే 6 నెలల కాలానికి వైద్య సేవలకోసం పారామెడికల్‌ సిబ్బంది, డాక్టర్ల నియామించ నున్నట్టు చెప్పారు.

ఇదికాక కోవిడ్‌ టెస్టులు, క్వారంటైన్‌ సదుపాయాలకోసం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. మొత్తంగా 138 ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్స అందిస్తామన్నారు.

క్రిటికల్‌ కేర్‌ కోసం రాష్ట్రస్థాయిలో అదనంగా 5 ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇప్పటికే 3 అందుబాటులోకి తెచ్చామని, మరికొన్నిరోజుల్లో మరో రెండు ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకొస్తామని జగన్ స్పష్టం చేశారు. క్రిటికల్‌ కేర్‌ కోసం అదనంగా 2380 బెడ్లను ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.