మీ తండ్రిని చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు జాలి కలగలేదా : అంబటి రాంబాబు

రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై అధికార వైసీపీ వీడియో ప్రజంటేషన్ ఇచ్చింది. అమరావతిలో భూముల స్కామ్ జరిగిందని చెబుతూ అందుకు సంబంధించిన అక్రమాల

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 12:33 PM IST
మీ తండ్రిని చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు జాలి కలగలేదా : అంబటి రాంబాబు

రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై అధికార వైసీపీ వీడియో ప్రజంటేషన్ ఇచ్చింది. అమరావతిలో భూముల స్కామ్ జరిగిందని చెబుతూ అందుకు సంబంధించిన అక్రమాల

రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై అధికార వైసీపీ వీడియో ప్రజంటేషన్ ఇచ్చింది. అమరావతిలో భూముల స్కామ్ జరిగిందని చెబుతూ అందుకు సంబంధించిన అక్రమాల ఆధారాలు, వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో నిడివి 21 నిమిషాలు ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఈ వీడియోని మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, పవన్ కళ్యాణ్ లపై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.

రాజధాని కోసం చేస్తున్న ఉద్యమానికి సాయంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి తన గాజులను విరాళంగా ఇచ్చిన అంశంపై అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. భువనేశ్వరి తీరుని ఆయన తప్పుపట్టారు. మీ కన్నతండ్రి ఎన్టీఆర్ ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నప్పుడు మీకు జాలి కలగలేదా? అని భువనేశ్వరిని అంబటి రాంబాబు నిలదీశారు. పుష్కరాల్లో 30మంది చనిపోయినప్పుడు భువనేశ్వరి ఎక్కడున్నారు అని అడిగారు. అప్పులతో రైతులు చనిపోతున్నా భువనేశ్వరికి జాలి కలగలేదన్నారు. ఇప్పుడు సడెన్ గా అంత జాలి ఎందుకు చూపుతున్నారని అడిగారు. అసలు.. మీ జాలి రైతుల మీదా? లేక అమరావతి భూముల మీదా? అని అంబటి రాంబాబు భువనేశ్వరిని క్వశ్చన్ చేశారు. తన కుమారుడు, భర్త అమరావతిలో కొన్న భూములపై భువనేశ్వరి ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోందని అంబటి రాంబాబు సందేహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు కుట్ర స్వభావం కలిగిన వ్యక్తి అని, అధికారం కోసం దేనికైనా తెగిస్తారని అంబటి రాంబాబు అన్నారు. అలాంటి వ్యక్తిని నమ్మొద్దని రాజధాని రైతులకు విజ్ఞప్తి చేశారు. హత్యలు చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందన్నారు. చంద్రబాబు తన దత్తపుత్రుడితో కలిసి కుటుంబసమేతంగా చిచ్చు పెట్టాలని చూస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. అమరావతిలో ఏదో జరుగుతోందని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో రైతులు ఆందోళన చేశారు.. అప్పుడెందుకు మాట్లాడలేదని నిలదీశారు. మెర్సీ కల్లింగ్ అంటూ చంద్రబాబు కొత్త డ్రామా మొదలు పెట్టారని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు హత్యలకు కూడా వెనుకాడరని అంబటి అన్నారు. రాజధానిలో హత్యలు చేయించి ఆత్మహత్యలుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందని.. రైతులు జాగ్రత్తగా ఉండాలని అంబటి రాంబాబు హెచ్చరించారు.

* రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ వీడియో ప్రజంటేషన్
* అమరావతిలో ల్యాండ్ స్కామ్ పై 21 నిమిషాల వీడియో విడుదల
* జూన్ 1, 2014 నుంచి డిసెంబర్ 31, 2014 వరకు ఇన్ సైడర్ ట్రేడింగ్
* బినామీ పేర్లతో కొన్న భూములు పోతాయన్న భయం పట్టుకుంది
* గుంటూరు జిల్లాలో 2279 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1790 ఎకరాలు కొనుగోలు
* అమరావతి రాజధాని ప్రకటనకుముందే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు
* మొత్తం 4069.95 ఎకరాల భూమి కొనుగోలు
* ఇన్నర్ రింగ్ రోడ్ కూడా భూములకు అనుకూలంగా కట్టాలనుకున్నారు

* 800మంది తెల్లరేషన్ కార్డుదారులు రాజధానిలో భూములు కొన్నారు
* 800మంది తెల్లరేషన్ కార్డుదారుల్లో 60మంది తెలంగాణకు చెందిన వారు
* రాజధాని ప్రకటన తర్వాత కూడా భారీగా భూములు కొనుగోలు
* సీఆర్డీఏ పరిధిని విస్తరించి భూముల విలువ పెంచారు
* రైతులపై చంద్రబాబు, పవన్ ది కపట ప్రేమ
* అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు
* ఉద్యమాల పేరుతో చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారు
* రాజధాని ప్రాంత రైతులను చంద్రబాబు మోసం చేశారు

* ఎక్కడైనా రాజధాని కోసం భూములు కావాలి.. కానీ భూముల కోసం రాజధాని ఏర్పాటు చేసిన ఘతన చంద్రబాబుదే
* రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపించేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు
* హైదరాబాద్ పై పదేళ్లు హక్కున్నా వదిలేసి వచ్చేశారు
* రాజధాని రైతులకు వైసీపీ అండగా ఉంటుంది
* రైతులకు న్యాయం చేస్తాం.. బినామీలకు, వ్యాపారులకు కాదు