మంచి పనులు చేస్తే ఎందుకు ఓడించారు

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ, చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మంచి పాలనకు అడ్డుపడుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. జగన్ సీఎం అయితే రాష్ట్రం అవినీతిమయం

  • Published By: veegamteam ,Published On : September 7, 2019 / 06:29 AM IST
మంచి పనులు చేస్తే ఎందుకు ఓడించారు

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ, చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మంచి పాలనకు అడ్డుపడుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. జగన్ సీఎం అయితే రాష్ట్రం అవినీతిమయం

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ, చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మంచి పాలనకు అడ్డుపడుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. జగన్ సీఎం అయితే రాష్ట్రం అవినీతిమయం అవుతుందని చంద్రబాబు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో అవినీతి రాజ్యమేలిందని, సహజ సంపదలను టీడీపీ నేతలు దోచుకున్నారని, మంత్రులే దోపిడీ దొంగలుగా వ్యవహరించారని అంబటి ఆరోపించారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఒక్క హామీనైనా అమలు చేశారా అని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు మంచి పనులు చేస్తే టీడీపీని ప్రజలు ఎందుకు ఓడించారని అంబటి అడిగారు.

సీఎం జగన్ ధర్మంగా పాలన చేస్తుంటే.. చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. కులం పేరుతో ఎమ్మెల్యే శ్రీదేవిని టీడీపీ నేతలు దూషిస్తే చంద్రబాబు ఎందుకు ఖండించలేదని నిలదీశారు. పార్టీ నేతలను చంద్రబాబు కాపాడుకోలేకపోతున్నారని అంబటి అన్నారు. రాజకీయ లబ్ది కోసమే పల్నాడులో లేని ఉద్రిక్తతను సృష్టిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.

విప్లవాత్మకమైన పాలన అందించాలనే ధృడ సంకల్పంతో సీఎం జగన్ ఈ 100 రోజులు పరిపాలన సాగించారని అంబటి చెప్పారు. రాజకీయ అవినీతిని అంతం చేయాలనే సంకల్పంతో జగన్ ఉన్నారని తెలిపారు. రాజకీయ అవినీతిని సహించేది లేదని వైసీపీ ఎమ్మెల్యేలను జగన్ హెచ్చరించారని అబటి చెప్పారు. వైసీపీ పాలనలో 100 రోజుల్లో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పని చేసిందని వివరించారు.