చంద్రబాబు పోలవరం టూర్
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10-30 గంటలతు పోలవరం చేరుకుని, అక్కడ అధికారులు, కాంట్రాక్టర్లతో మట్లాడనున్నారు. జరుగుతున్న పనులను పరిశీలించి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. పోలవరం ప్రాజెక్టు సమీక్షకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని ఆయన తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు , సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రేపు చంద్రబాబు పోలవరం పర్యటనపై ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి,