తిరుపతిలో టెన్షన్ : నటుడు మోహన్ బాబు హౌస్ అరెస్ట్

  • Published By: veegamteam ,Published On : March 22, 2019 / 04:21 AM IST
తిరుపతిలో టెన్షన్ : నటుడు మోహన్ బాబు హౌస్ అరెస్ట్

నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఫీజు రీయింబర్స్ ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. తిరుపతిలో ధర్నాకి సిద్ధం అయ్యారు. మాట ఇచ్చిన ప్రభుత్వం అంటూ గళం వినిపిస్తున్నారు. విధ్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులను కాలేజీలకు చెల్లించకుండా.. యాజమాన్యాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రోడ్డెక్కారు. 
Read Also : చావుతో ఆటలు : PubG ఆడుతూ నరాలు పట్టేసి.. చనిపోయాడు

ఎన్నికల కోడ్ అమలుల్లో ఉందని.. ధర్నాకు అనుమతి లేదని తెగేసి చెప్పారు పోలీసులు. అయినా పట్టు వీడలేదు. మోహన్ బాబు. ధర్నా చేసి తీరతాను అంటూ బయటకు వచ్చారు. అప్పటికే ఇంటి బయట ఉన్న బలగాలు.. ఆయన్ను రోడ్డుపైకి రాకుండా అడ్డుకున్నాయి. తిరుపతిలో విద్యార్ధులతో కలిసి మోహన్ బాబు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధపడుతున్న క్రమంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. 

ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజుల చెల్లింపు విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనీ.. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ మండిపడ్డారు ఆయన. రంగంపేటలోని  శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల దగ్గర మోహన్ బాబు నిరసనకు పిలుపునిచ్చారు. పోలీసులు భారీగా మోహరించటంతో ఉద్రిక్తత నెలకొంది.

కొన్ని రోజులుగా మోహన్ బాబు.. సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేస్తారనే వార్తలు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే.. ధర్నాకి పిలుపునివ్వటం టీడీపీలో కలకలం రేపుతోంది. 

Read Also : జై చంద్రబాబు అంటున్న రామ్ గోపాల్ వర్మ