ఎన్నిక‌లు త‌ర్వాత‌ : నన్ను క్షమించండి.. బాల‌య్య విన్న‌పం

ఎన్నిక‌లు త‌ర్వాత‌ : నన్ను క్షమించండి.. బాల‌య్య విన్న‌పం

హిందూపురం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలకృష్ణ మార్చి 27 బుధవారం ఎన్నికల ప్రచారంలో జర్నలిస్టుపై చేయి చేసుకున్నారు. అది కాస్తా కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయి దుష్ప్రచారం జరగడంతో బాలకృష్ణ  ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. అది అనుకోకుండా జరిగిందేనని ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదంటూ మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్పారు. 

మీడియా మిత్రులకి నమస్కారం,
ఇవాళ నా ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడున్న చిన్న పిల్లల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరిమూకల పని అని భావించి వారిని వద్దని వారించడం జరిగింది, అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసింది. అంతే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదు. 
ఈ విషయం లో మీడియా మిత్రులకి బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతూ… 
మీ నందమూరి బాలకృష్ణ.

కానీ, ఆ వీడియోలో బాలకృష్ణ చేసిన కామెంట్లు చూస్తుంటే.. అనుమానంగానే అనిపిస్తుంది. ప్రాణం తీసేస్తా.. అంటూ బూతులు మాట్లాడిన ఆయన మా జీవితాలు మీ చేతుల్లో ఉంటాయా.. ఆ.. అంటూ బెదిరింపులకు దిగినట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది.