మహా హారతి : ధర్మపురికి త్రిదండి చిన జీయర్ స్వామి

  • Published By: madhu ,Published On : November 24, 2019 / 01:34 AM IST
మహా హారతి : ధర్మపురికి త్రిదండి చిన జీయర్ స్వామి

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి మహా హారతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2019, నవంబర్ 24వ తేదీ ఆదివారం సాయంత్రం జరిపే ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌ స్వామి సహా పలువురు పీఠాధిపతులు హాజరకానున్నారు. కాశీలో నిర్వహిస్తున్న గంగా హారతి తరహాలోనే గోదావరి మహా హారతికి దేశం నలుమూల నుంచి సాధువులు, వేద పండితులు రానున్నారు. హారతి.. హిందువుల దేవార్చన, సంస్కృతి, సంప్రదాయల్లో ఒక భాగం. జీవనదులకు హారతి ఇవ్వడం అనాదిగా వస్తున్న ఆచారం. నీటికి నీరాజనాలు పలకడం మన సనాతన సంప్రదాయం. ఇది హిందువుల జీవన సంస్కృతి. అయితే కాలక్రమంలో ఇవన్నీ మరుగునపడిపోయాయి. మళ్లీ ఈ హారతి సంస్కృతి పనురుద్ధరించి, పరిరక్షంచే లక్ష్యంతో ఏడేళ్ల క్రితం జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో గోదావరి నదికి మహా హారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్తీకమాసం చివరి ఆదివారం హారతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 

కాశీలో గంగానది దిశను మార్చకుని ప్రవహించినట్టే.. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నది ధర్మపురి వద్ద దిశను మార్చుకుని  దక్షిణాభిముఖంగా ప్రవహిస్తుంది. నదులు దిశను మార్చుకుని ప్రహించే ప్రంతాలను ఎంతో పవిత్ర ప్రదేశాలు పరిగణిస్తారు. ఇలాంటి చోట్ల కర్పూర హారతి ఇస్తే ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లుతారని నమ్మకం. జీవనదుల జలాల పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉంటారని విశ్వాసం. ఈ నమ్మకంతోనే ఏడేళ్లుగా కార్తీక మాసం చివరి ఆదివారం ధర్మపురిలో గోదావరికి మహా హారతి ఇస్తున్నారు. బీజేపీ ప్రధాన కార్యరద్శి మరళీధర్‌రావు ఆధ్వర్యంలో 2012 నుంచి  ఈ కార్యక్రమంలో జరుగుతోంది. 

గోదావరి మహా హారతిని చూసి తరించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి  భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా ధర్మపురిలో ఏర్పాట్లు చేశారు.  గోదావరి నదిలో కార్తీక దీపాలు వదిలే మహిళల కోసం గోదావరి హారతి ఉత్సక కమిటీ నది ఒడ్డున  ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. గోదావరి పవిత్రతను కాపాడే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం జరుపనున్నారు. 
Read More : సికింద్రాబాద్‌లో 4 కిలోల బంగారం పట్టివేత