‘సేవామిత్ర’తో టీడీపీ ఓట్లు తొలగిస్తుందా?

  • Published By: vamsi ,Published On : February 26, 2019 / 03:52 AM IST
‘సేవామిత్ర’తో టీడీపీ ఓట్లు తొలగిస్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ ఓట్లకు సంబంధించి అవకతవకలకు పాల్పడుతుందంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే పలు ఫిర్యదులు ఎన్నికల కమీషన్ కు చేసిన సంగతి తెలిసిందే. కీలకమైన ఎన్నికలకు ముందు గెలుపే లక్ష్యంగా అధికార తెలుగుదేశం పార్టీ ఒక యాప్ ద్వారా ఓట్ల డేటాను సేకరిస్తున్నట్లు వైసీపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆధార్ సంస్థకు సైబరాబాద్ పోలీసులకు ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యదులు ఇచ్చారు. 
వలం ఒకటి రెండు శాతం ఓట్ల వ్యత్యాసంతోనే పార్టీల జయాపజయాలు నిర్ణయించబడుతున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతున్న నకిలీ సర్వేలు, ఓట్ల దొంగలపై ఎన్నికల సంఘం గట్టి చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ కోరుతుంది. ఓటమి భయంతో అధికార టీడీపీ దొంగ ఓట్లను నమోదు చేయించడంతోపాటు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను పెద్ద ఎత్తున తొలగింపచేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. తెలుగుదేశంకు సంబంధించిన “సేవా మిత్ర” అనే అప్లికేషన్ ద్వారా ఈ రకమైన చర్యలకు టీడీపీ పాల్పడుతుందంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా ఎలక్షన్ కమీషన్ తయారు చేసిన డేటాను టీడీపీ దుర్వినియోగం చేస్తుందంటూ ఆయన ఆరోపణలు చేశారు.     
హైదరాబాద్ మాదాపూర్ లోని ఐటీ గ్రడ్స్ ఇండియా ప్రై లిమిటెడ్ ఆద్వర్యంలో సేవామిత్ర యాప్ ద్వారా వివిధ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగాలను వీరి ఆధీనంలో ఉంచుకున్నట్లు వైసీపీ చెబుతుంది. ఈ యాప్ లో ఓటర్ ఐడీ నంబర్స్, పేర్లు, కలర్ ఫోటోలు, బూత్ లెవల్ ఇన్ఫర్మేషన్, కుటుంబ వివరాలు, కులానికి సంబంధించిన సమాచారం, ప్రభుత్వ పథకాలు, ఒక్క ఓటర్ ఎంత డబ్బులు ప్రభుత్వం నుంచి లబ్ధిపొందాడు. అనే వివరాలు ఉన్నట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ డేటా మొత్తం సేవా మిత్రలో ఉండగా టీడీపీ వాటిని వాడుకుంటుందని వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తుంది.