విశాఖలో టీడీపీకి మరో షాక్ : వైసీపీలోకి అయ్యన్న పాత్రుడు సోదరుడు

  • Published By: madhu ,Published On : November 3, 2019 / 02:37 PM IST
విశాఖలో టీడీపీకి మరో షాక్ : వైసీపీలోకి అయ్యన్న పాత్రుడు సోదరుడు

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారం వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు, నేతలతో కలిసి ఆయన తాడేపల్లికి బయలుదేరారు. ఇటీవలే ఆయన టీడీపీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 06వ తేదీన పార్టీలో చేరుతారని ప్రచారం జరిగినా..అది వీలు కాలేదు. పార్టీ అధిష్టానం తాజాగా క్లారిటీ ఇవ్వడంతో సన్యాసీ పాత్రుడు వైసీపీలో చేరుతున్నారు. 

తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేతలు ఆ పార్టీని వీడి ఇప్పటివరకు బీజేపీలోకి వెళ్లగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైసీపీలోకి వెళ్లేందుకు టీడీపీ నేతలు సిద్ధం అవుతున్నారు. విశాఖపట్టణం డెయిరీకి చెందిన టీడీపీ కీలక నేతలు..వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సన్యాసి పాత్రుడు కూడా అదే బాటలో వెళుతున్నారు. అయ్యన్న పాత్రుడు, సన్యాసి పాత్రుడి మధ్య చాలాకాలం నుంచి వైరం ఉంది. నర్సీపట్నం మున్సిపాల్టీపై ఆయనకు పట్టు ఉండడంతో ఆయన్ను వైసీపీలో చేర్చేందుకు కీలక నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరితే..నియోజకవర్గంలో పట్టు సాధించవచ్చని భావిస్తున్నారు. 

ఇటీవలే జరిగిన ఎన్నికల కంటే ముందుగానే..వైసీపీలో చేరాలని సన్యాసి పాత్రుడు భావించినట్లు ప్రచారం జరిగింది. నర్సీపట్నం టికెట్ కావాలని కోరడం..జగన్ నో చెప్పడంతోనే వైసీపీలోకి ఎంట్రీ ఆగిపోయిందని టాక్. మరి..సన్యాసీ పాత్రుడు వైసీపీలో చేరికపై టీడీపీ నేతలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. 
Read More : సూట్ కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డి విమర్శలు చేస్తారా?