ఏందీ రచ్చా : రైతులకు మేం అన్యాయం చేస్తే..మీరు న్యాయం చేయండి

  • Published By: veegamteam ,Published On : November 28, 2019 / 05:35 AM IST
ఏందీ రచ్చా :  రైతులకు మేం అన్యాయం చేస్తే..మీరు న్యాయం చేయండి

అమరావతి నిర్మాణంలో తమ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తోందనీ..తాము అన్యాయం చేస్తే  మీరు న్యాయం చేయండి..దాన్ని మేము ఆహ్వానిస్తాం..అంతే తప్ప ఈ రచ్చ చేయటం ఎందుకు అంటూ టీడీపీ నేత..మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మండి పడ్డారు.  రైతులకు లీజు డబ్బులు ఎక్కువ ఇస్తామని హామీ ఇవ్వండి  మేము స్వాగతిస్తాం.. అంతే తప్ప కేవలం విమర్శలు చేస్తు..ఇష్టమొచ్చినట్లుగా మాట్లటం సరికాదన్నారు. అమరావతి నిర్మాణంపై వైసీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు.  

చంద్రబాబు అమరావతిని నిర్మించలేదు..కేవలం ఫోటోలే చూపిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. తొలివిడతలో రాజధానిలో పర్యటించి వాస్తవాలను ప్రజలకు చూపించామని స్పష్టం చేశారు. అమరావతిలో చంద్రబాబు నిర్మించిన భవనాలు కళ్లకు కనిపిస్తుంటే వైసీపీ నేతలకు అవి కనింపించటంలేదా అంటూ ప్రశ్నించారు. అమరావతి విషయంలో సీఎం జగన్ ఎప్పటికప్పుడు మాటలు మారుస్తున్నారనీ..కానీ అవాస్తవాలను ప్రచారం చేస్తు ప్రజల్ని ప్రభుత్వం ఏమారుస్తోందన్నారు. వాస్తవాలను నిరూపించేందుకు చంద్రబాబు. రాజధానిని భూములిచ్చిన రైతులు వైసీపీ మాయలో పడితే నష్టపోతారని సూచించారు.

ఇలా అధికార ప్రతిపక్షాల నేతల మాటల యుద్ధాలతో చంద్రబాబు అమరావతి పర్యటన రచ్చ రచ్చగా మారింది. పక్కా ప్లాన్ తో వైసీపీ ఆందోళనకారుల్ని రెచ్చగొట్టిందని టీడీపీ అంటుంటే..వైసీపీ మాత్రం రైతులకు అన్యాయం చేసి భూములు లాక్కుని అన్యాయం చేశారని ఆరోపిస్తుంది. దీనిపై వాస్తవాలు తేల్చేందుకే చంద్రబాబు నాయుడు పర్యటన చేస్తుంటూ వైసీపీ ఎందుకు భయపడతోందనీ..ఎందుకు అడ్డుకుంటోందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.