మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తాం : సీఎం చంద్రబాబు

మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేయబోనని తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : March 19, 2019 / 10:21 AM IST
మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తాం : సీఎం చంద్రబాబు

మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేయబోనని తెలిపారు.

అనంతపురం : మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేయబోనని తెలిపారు. అసంతృప్తి లేకుండా అందరూ పార్టీ కోసం పని చేయాలని కోరారు. పసుపు సైన్య సంకల్పం తీసుకుంటే ఏ శక్తీ అడ్డుకోదన్నారు. అనంతపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీకి అండగా ఉండే జిల్లా అనంతపురం అని కొనియాడారు. జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు గెలించాలని విజ్ఞప్తి చేశారు.
Read Also : ఒక్కటి సరిపోదు : అన్నయ్యలాగే పవన్ కళ్యాణ్ కూడా!

గోదావరి, కృష్ణా, పెన్నా అన్ని నదులను కలుపుతామని చెప్పారు. కృష్ణా-గోదావరిని కలిపామని, కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం మొదలు పెట్టామని తెలిపారు. రూ.6 వేల 500 కోట్లతో సాగర్ కుడి కాల్వకు నీళ్లు తీసుకొచ్చామని తెలిపారు. రైతుకు లాభసాటిగా ఉండే పనులన్నీ చేయిస్తామన్నారు. జిల్లాను ఇండస్ట్రీ హబ్ గా తయారు చేస్తామని తెలిపారు. వ్యవసాయం, హార్టికల్చర్ లో అధిక ఆదాయం వచ్చే జిల్లా అనంతపురం అని కొనియాడారు. అనంతపురానికి కియా కార్ల కంపెనీ వస్తే వైసీపీ తట్టుకోలేకపోతుందన్నారు. జిల్లా బాగుపడితే జగన్ చూడలేకపోతున్నారని విమర్శించారు. 
Read Also : వైసీపీది నేరగాళ్ళ ప్రకటన : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు