రాజధాని పేరుతో చంద్రబాబు దందాలు : కన్నా లక్ష్మీనారాయణ

రాజధాని అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు దందాలు చేస్తున్నారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విమర్శించారు.

  • Published By: veegamteam ,Published On : February 10, 2019 / 06:30 AM IST
రాజధాని పేరుతో చంద్రబాబు దందాలు : కన్నా లక్ష్మీనారాయణ

రాజధాని అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు దందాలు చేస్తున్నారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విమర్శించారు.

గుంటూరు : రాజధాని అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు దందాలు చేస్తున్నారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విమర్శించారు. వ్యాపారం చేసుకోవడం కోసమే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని పేర్కొన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు ఏపీకి ఏం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. గుంటూరు పరిసర ప్రాంతాల ప్రజలకు చంద్రబాబు ఏం చేశారు? అని నిలదీశారు. రాష్ట్రాభివృద్ధిని చంద్రబాబును గాలికి వదిలేశారని విమర్శించారు. రాజధాని పేరుతో చంద్రబాబు దందాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర పథకాల్లో ఎంతో అవినీతి, అక్రమాలు జరిగాయన్నారు. 

మోడీ ప్రధాని కావడం మన దేశానికి గర్వకారణమన్నారు. భారతదేశ ప్రతిష్టను దశదిశలా వ్యాపింపచేశారని పేర్కొన్నారు. గుంటూరు పర్యటనకు వచ్చిన ప్రధానిని ఆహ్వానిస్తున్నామన్నారు. 2014 తర్వాత రాష్ట్రాభివృద్ధికి మోడీ కృషి చేశారని చెప్పారు. పోలవరం నిర్మాణానికి నూటినూరు శాతం నిధులు ఇచ్చారని తెలిపారు. జాతీయ రహదారుల అభివృద్ధి, ఎయిమ్స్ ను పూర్తి చేయగలిగామని తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం కొన్ని లక్షల కోట్లు ఇచ్చారని చెప్పారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఎంతో సహకరిస్తోందన్నారు. విజయవాడలో నాలుగు లైన్ల రహదారులు, రెండు ఫ్లైవోవర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి చేసిన మేలును ఏపీ ప్రజలు మర్చిపోరన్నారు. గన్నవరం ఎయిర్ పోర్టును అంతర్జాతీయ ఎయిర్ పోర్టుగా మార్చిన ఘనత మోడీదే. ఏపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెడుతున్నా పెద్ద ఎత్తున కార్యకర్తలు సభకు వచ్చారని చెప్పారు.