ఆశీర్వదించండి…అమిత్ షా,నడ్డాని కలిసిన బండి సంజయ్

కొత్తగా తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన బండి సంబయ్ కుమార్ గురువారం(మార్చి-12,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు. అమి

ఆశీర్వదించండి…అమిత్ షా,నడ్డాని కలిసిన బండి సంజయ్

Bjp

కొత్తగా తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన బండి సంబయ్ కుమార్ గురువారం(మార్చి-12,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు. అమిత్ షా,నడ్డాని కలిసే సమయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా బండి సంజయ్ వెంట ఉన్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ బుధవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా బండి సంజయ్ కు అమిత్ షా,నడ్డా శుభాకాంక్షలు తెలియజేశారు. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం పట్ల నడ్డాకు,అమిత్ షాకు సంజయ్ కూడా కృతజ్ణతలు తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బండి సంజయ్ తెలిపారు. బండి సంజయ్ ఏబీవీబీ కార్యకర్త స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ఈయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది.