మరో ముందడుగు : మైండ్ స్పేస్ జంక్షన్ మార్గంలో మెట్రో రైలు
హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశలో మరో ముందడుగు వేసింది. హైటెక్ సిటీ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు మెట్రో రైలు సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. నవంబర్ 29 నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ దీన్ని ప్రారంభించనున్నారు. దీంతో కారిడార్ -3లో నాగోల్ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు సుమారు 28 కిలోమీటర్ల దూరం మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి మెట్రో సేవలు ప్రారంభమైతే వేలాది మంది ఐటీ ఉద్యోగులకు ప్రయాణ సౌకర్యం మెరుగవుతుంది.
మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద ఎన్నో ఐటీ కంపెనీలున్నాయి. ఇక్కడ వేలాది మంది ఉద్యోగులు వర్క్ చేస్తుంటారు. ఇక్కడకు రావడానికి మెట్రో, వాహనాలను ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు మెట్రో రైలు అందుబాటులోకి వస్తుండడంతో వీరికి ఎంతో లాభం కలుగనుంది. వేలాది మంది ఐటీ ఉద్యోగులకు ప్రయాణ సౌకర్యం మెరుగవుతుందని మెట్రో పేర్కొంటోంది. ఇప్పటి వరకు హైటెక్ సిటీ, రాయదుర్గం చెరువు మెట్రో స్టేషన్ల నుంచి షటిల్ సర్వీసుల ద్వారా కంపెనీలకు వచ్చే ఉద్యోగులకు ఇక నుంచి ఐటీ కంపెనీలకు చాలా దగ్గరగా ఉన్న మైండ్ స్పేస్ జంక్షన్ వరకు రానున్నారు. మరోవైపు కారిడార్ – 2 నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న 10 కిలోమీటర్ల మార్గాన్ని డిసెంబర్ నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read More : బ్రేకింగ్ : ఆర్టీసీని మోయలేం..యథాతథంగా నడపలేం