Siddaramaiah: బెంగళూరు చేరుకుంటున్న విపక్ష నేతలు.. అంగరంగ వైభవంగా సిద్ధూ ప్రమాణస్వీకారం

కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు. వీరితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‭గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు హాజరు అవుతున్నారు.

Siddaramaiah: బెంగళూరు చేరుకుంటున్న విపక్ష నేతలు.. అంగరంగ వైభవంగా సిద్ధూ ప్రమాణస్వీకారం

Oath Ceremony: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్ర రాజధాని బెంగళూరలోని కంఠవీర స్టేడియంలో ఘనమైన ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు దేశంలోని పలు విపక్ష పార్టీల నేతలు హాజరు అవుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇప్పటికే సభా స్థలికి చేరుకున్నారు. మక్కల్ నీధి మయ్యం అధినేత ఎంకే స్టాలిన్ సైతం వచ్చారు. వీరికి కర్ణాటకకు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డీకే శివకుమార్ స్వాగతం పలికారు. ఇంక పులువురు నేతలు రావాల్సి ఉంది.


కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు. వీరితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‭గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు హాజరు అవుతున్నారు. ఇక జేడీఎస్, ఆర్జేడీ, ఎన్సీపీ, శివసేన (యూబీటీ), టీఎంసీ, సీపీఎం, సీపీఐ, ఎస్పీ వంటి విపక్ష పార్టీల నేతలను కూడా ఆహ్వానించారు.