పవన్ ఉత్తరాంధ్ర పర్యటన
జనవరి 23 నుంచి 25 వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు.
జనవరి 23 నుంచి 25 వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు.
విశాఖ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు సిద్ధమయ్యారు. మూడు రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనవరి 23 నుంచి 25 వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పాడేరులో పవన్ బహిరంగ సభ ఉంటుంది. మూడు రోజులు మూడు జిల్లాల నేతలతో పవన్ సమావేశం కానున్నారు. 23వ తేదీ శ్రీకాకుళం జిల్లా, 24వ తేదీ విజయనగరం జిల్లా, 25వ తేదీ విశాఖ జిల్లా నేతలతో పవన్ సమావేశం అవుతారు. ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించనున్నారు.