Madhya Pradesh Politics: టికెట్ రాకపోయినా పార్టీతోనే ఉంటామంటూ ప్రమాణం చేసిన కాంగ్రెస్ నేతలు

రాష్ట్ర సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వారి చేత ఈ ప్రమాణం చేయించారు. బుధవారం రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై ఉన్న కాంగ్రెస్ నేతలను రెండు చేతులు పైకెత్తించి ‘‘పార్టీ నుంచి నాకు టికెట్ రాకపోయినా పార్టీ వెంటే ఉంటాము. పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుమడి ఉంటాము

Madhya Pradesh Politics: టికెట్ రాకపోయినా పార్టీతోనే ఉంటామంటూ ప్రమాణం చేసిన కాంగ్రెస్ నేతలు

Digvijaya Singh: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని రాజకీయ పార్టీల్లో గొడవలు గుప్పుమంటాయి. పార్టీ టికెట్ల పంపిణీలో వచ్చే తగువులు పరిష్కరించడం అంత సులువు కాదు మరి. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఇందుకు పెట్టింది పేరు. ఆ పార్టీలో ఉండే గ్రూపుల గొడవలు కానీ, టికెట్ రాని వారు చేసే హంగామా గురించి కానీ ప్రత్యేకంగా చెప్పేది కాదు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. టికెట్ రాకపోయినా పార్టీ వెంటే ఉంటామని, పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుమడి ఉంటామని ప్రమాణ స్వీకారం చేశారు.

9Years Of Modi Government: చైనా కూడా కొట్టుమిట్టాడుతోంది.. మన దేశం మాత్రం…: లక్ష్మణ్

మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి నాయకులు చేసిన ప్రమాణం ఇది. రాష్ట్ర సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వారి చేత ఈ ప్రమాణం చేయించారు. బుధవారం రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై ఉన్న కాంగ్రెస్ నేతలను రెండు చేతులు పైకెత్తించి ‘‘పార్టీ నుంచి నాకు టికెట్ రాకపోయినా పార్టీ వెంటే ఉంటాము. పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుమడి ఉంటాము. పార్టీకి వ్యతిరేకంగా పని చేయము. పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి ప్రచారం చేస్తాం’’ అని ప్రమాణ స్వీకారం చేశారు.