Revanth Reddy : 50లక్షల మంది జీవితాలతో చెలగాటం- కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

Revanth Reddy: తొమ్మిదేళ్లలో ఉన్న ఉద్యోగాలు పోయాయి తప్ప కొత్త ఉద్యోగాలు రాలేదు. 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే కేసీఆర్ మారిండేమో అనుకున్నాం. కానీ ఇవాళ జరిగిందేంటో మీకు తెలిసిందే.

Revanth Reddy : 50లక్షల మంది జీవితాలతో చెలగాటం- కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

Revanth Reddy

Revanth Reddy : రాష్ట్రంలో 50లక్షల మంది విద్యార్థి, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఖమ్మంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించింది కాంగ్రెస్. ఈ సందర్భంగా బహిరంగ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ గా నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. 1969లో మా ఉద్యోగాలు మాకు కావాలంటూ తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలోనే మొదలైందని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం కావాలని కేసీఆర్ చెప్పారని, తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని రేవంత్ రెడ్డి వాపోయారు. అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదని ఆరోపించారు.

” తెలంగాణ నిరుద్యోగులకు, మేధావులకు, అమరుల కుటుంబాలకు నేను గుర్తు చేయదలచుకున్నా. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక లక్ష 7వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చింది. తొమ్మిదేళ్లలో ఉన్న ఉద్యోగాలు పోయాయి తప్ప కొత్త ఉద్యోగాలు రాలేదు. 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే కేసీఆర్ మారిండేమో అనుకున్నాం. కానీ ఇవాళ జరిగిందేంటో మీకు తెలిసిందే.

Also Read..YS Sharmila : అందుకే అరెస్ట్.. షర్మిల వ్యవహారంపై సీపీ సీవీ ఆనంద్ రియాక్షన్

రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు బజార్ లో దొరుకుతున్నాయి. టీఎస్ పీఎస్ సీ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పంపకాల్లో తేడాలు వచ్చి విషయం బయటపడింది తప్ప ప్రభుత్వం చేసిందేం లేదు. మేం నిలదీస్తే విచారణ అధికారులు మాకు నోటీసులు ఇచ్చారు. కొడుకును మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటే కేసీఆర్ నాకు నోటీసులు పంపారు. నాపై ఇప్పటికే 130 కేసులు పెట్టినావు కేసీఆర్. ఇంతకంటే ఇంకేం చేస్తావ్.

Also Read..Sangareddy Constituency : సంగారెడ్డిలో జగ్గారెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది.. బీఆర్ఎస్ ఈసారి జెండా ఎగరేస్తుందా?

హైదరాబాద్ లో జరిగే నిరుద్యోగ నిరసన సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారు. ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా ప్రజలను కోరుతున్నా. ఖమ్మం జిల్లాలో ఒంటి కన్ను శివరాసన్ ను పాతాళానికి తొక్కేయాలి. జిల్లాలో 10కి 10 సీట్లు కాంగ్రెస్ కు ఇవ్వండి. రాష్ట్రంలో నూటికి 90 సీట్లు తెచ్చే బాధ్యత మేం తీసుకుంటాం” అని రేవంత్ రెడ్డి అన్నారు.