అన్నకి తమ్ముడి షాక్ : జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక

టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఆయన సోదరుడు గట్టి షాక్‌ ఇచ్చారు. సన్యాసిపాత్రుడు.. సోమవారం(నవంబర్ 4,2019) సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

  • Published By: veegamteam ,Published On : November 4, 2019 / 01:55 PM IST
అన్నకి తమ్ముడి షాక్ : జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక

టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఆయన సోదరుడు గట్టి షాక్‌ ఇచ్చారు. సన్యాసిపాత్రుడు.. సోమవారం(నవంబర్ 4,2019) సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఆయన సోదరుడు గట్టి షాక్‌ ఇచ్చారు. సన్యాసిపాత్రుడు.. సోమవారం(నవంబర్ 4,2019) సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలోకి వెళ్లారు. సన్యాసిపాత్రుడుని సీఎం జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ కండువా కప్పుకున్నారు.  

టీడీపీ తీరుతో మనస్తాపం చెందానని.. టీడీపీలో తనకు ప్రాధాన్యత లేకుండా చేశారని సన్యాసిపాత్రుడు వాపోయరు. గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించారని ఆరోపించారు. ఈ విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. తన పట్ల వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెంది టీడీపీకి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. వైసీపీలో చేరడం ఆనందంగా ఉందన్న సన్యాసిపాత్రుడు… పార్టీ బలోపేతానికి.. నర్సీపట్నం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఏపీలో టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. కొందరు బీజేపీలోకి వెళ్లారు. ఇంకొందరు అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. విశాఖ డెయిరీకి చెందిన టీడీపీ కీలక నేతలు.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సన్యాసి పాత్రుడు కూడా అదే బాటలో వెళ్లారు. అయ్యన్న పాత్రుడు, సన్యాసి పాత్రుడి మధ్య చాలాకాలం నుంచి వైరం ఉంది. నర్సీపట్నం మున్సిపాల్టీపై సన్యాసిపాత్రుడికి పట్టు ఉంది. ఆయన చేరికతో నియోజకవర్గంలో పట్టు సాధించవచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నారు.