వేడెక్కిన రాజంపేట టీడీపీ రాజకీయం
మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పోటీపోటీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.
మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పోటీపోటీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.
కడప : జిల్లాలోని రాజంపేట టీడీపీ రాజకీయం వేడెక్కింది. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పోటీపోటీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. అనుచరులతో ఎమ్మెల్యే మేడా రహస్య మంతనాలు జరుపుతున్నారు. ఆర్ అండ్ బి గెస్ట్హౌస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అయితే తనను టీడీపీ నుంచి బయటకు పంపేందుకే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే మేడా అంటున్నారు. సాయంత్రం లోగా మేడా తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రమే మేడా శాసనసభ సభ్యత్వానికి, టీడీపీకి రాజీనామా చేసే అవకాశం ఉంది.