లోకల్ వార్ : తుది విడతలోనూ కారు జోరు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోరులోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కనిపించింది. టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో

  • Published By: veegamteam ,Published On : January 30, 2019 / 09:48 AM IST
లోకల్ వార్ : తుది విడతలోనూ కారు జోరు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోరులోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కనిపించింది. టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోరులోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కనిపించింది. టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. మధ్యాహ్నం 3గంటల వరకు వెలువడిన ఫలితాల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 467 స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ 37, ఇతరులు 69 పంచాయతీల్లో విజయం సాధించారు. 3వేల 506 గ్రామ పంచాయతీల్లో ఫలితాలు వెలువడుతున్నాయి. తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 576 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.

 

2019, జనవరి 30వ తేదీ బుధవారం ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుండి పోలైన ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. మొదటగా వార్డు సభ్యుల ఓట్లు.. అనంతరం సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. పూర్తి ఫలితాలు రావడానికి సాయంత్రం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సర్పంచ్ ఫలితాల తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది.

 

రాష్ట్రంలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. మూడో విడతలో 4వేల 116 గ్రామాల్లో ఎన్నికలు జరగాలి. అయితే 576 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 10 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. రిజర్వేషన్ల కారణంగా జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం మంగపేట మండలంలోని 25 గ్రామాల్లో ఎన్నికలు జరగలేదు. 3వేల 506 గ్రామాల్లో పోలింగ్ జరిగింది.

 

* తుది విడతలో 4వేల 116 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్‌
* రాష్ట్ర వ్యాప్తంగా 576 పంచాయతీలు ఏకగ్రీవం
* పది గ్రామాల్లో దాఖలు కాని నామినేషన్లు
* సర్పంచ్‌ పదవులకు 11వేల 667మంది పోటీ
* 36వేల 729 వార్డులకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌
* రాష్ట్ర వ్యాప్తంగా 8వేల 959 వార్డులు ఏకగ్రీవం
* 186 వార్డుల్లో దాఖలు కాని నామినేషన్లు
* 27వేల 582 వార్డులకు పోలింగ్‌
* వార్డు సభ్యుల పదవులకు 73వేల 976 మంది పోటీ