నేరేడుచర్లలో టెన్షన్..టెన్షన్ : ఉత్తమ్, కేవీపీ అరెస్టు

సూర్యపేట జిల్లా నేరేడుచర్లలో ఉద్రిక్తత నెలకొంది. ఉత్తమ్, కేవీపీతోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

  • Published By: veegamteam ,Published On : January 28, 2020 / 07:59 AM IST
నేరేడుచర్లలో టెన్షన్..టెన్షన్ : ఉత్తమ్, కేవీపీ అరెస్టు

సూర్యపేట జిల్లా నేరేడుచర్లలో ఉద్రిక్తత నెలకొంది. ఉత్తమ్, కేవీపీతోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

సూర్యపేట జిల్లా నేరేడుచర్లలో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సక్రమంగా నిర్వహించలేదని ఆరోపిస్తూ ప్రమాణస్వీకారం నుంచి కాంగ్రెస్ నేతలు వాకౌట్ చేశారు. మున్సిపాలిటీ సభ్యుల ప్రమాణస్వీకారాన్ని బహిష్కరించారు. నిన్నటి జాబితా ప్రకారం ప్రమాణస్వీకారం చేయించడం లేదని అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు నేరేడుచర్ల సెంటర్ లో పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కేవీపీ, కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి, ధర్నాకు దిగారు. ఈసీ నాగిరెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా వ్యహరించారని ఆరోపించారు. ఎన్నికల అధికారులు టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు. దీంతో ఉత్తమ్, కేవీపీతోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

uttam

అంతకముందు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ బహిష్కరించింది. కాంగ్రెస్, సీపీఎం సభ్యులు సమావేశం నుంచి బయటకు వచ్చారు. మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో గందరగోళం నెలకొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి ఓటు చెల్లదంటూ కాంగ్రెస్ నిరసన తెలిపింది. రాత్రికి రాత్రే ఓటు నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుభాష్ రెడ్డిని బయటికి పంపించాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్ జరిపితే ఆత్మహత్య చేసుకుంటామని కాంగ్రెస్ సభ్యులు బెదిరించారు. అలాగే ఓటింగ్ జరిపే ప్రయత్నం చేయడంతో కాంగ్రెస్ సభ్యులు ఎన్నికను బహష్కరించి బయటకు వచ్చారు. 

ఉదయం 11 గంటలకు చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగానే ప్రమాణస్వీకారం కాకముందే స్థానిక ఎంపీ ఉత్తమ్, కాంగ్రెస్ సభ్యులు సుభాష్ రెడ్డి పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. సుభాష్ రెడ్డిని బయటికి పంపించిన తర్వాతనే ప్రమాణస్వీకారం ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు. చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాత్రికి రాత్రే సుభాష్ రెడ్డి ఓటు నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

uttam kumar

చాలా సేపు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ సభ్యులు ఎంతసేపు వాదన చేసినా స్వయంగా తాము లిస్టు తయారు చేయలేదు, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన లిస్టు ప్రకారమే చేస్తామని అధికారులు చెప్పారు. మీరు చెప్పదల్చుకున్నది ఎన్నికల సంఘం దగ్గర చెప్పుకోవాలని చెప్పారు. అధికారులు ఎన్నికను కొనసాగించారు. మున్సిపాలిటీ ఛైర్మన్ గా జయబాబు, వైస్ ఛైర్ పర్సన్ గా శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు.