Shiv Sena: అసలైన పులి షిండేనే.. ఉద్ధవ్ థాకరేకు షాకిస్తూ శివసేనను షిండేకు కేటాయించిన ఈసీ

ఉద్ధవ్‌, షిండే వర్గాల వాదోపవాదాలు, ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకుని, శుక్రవారం తుది ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. షిండే వర్గానిదే అసలైన శివసేన అని ఆ ఆదేశాల్లో ప్రకటించింది. ఆరు నెలల క్రితం కమిషన్‌ ఏర్పడగానే 1996లో ఏర్పడ్డ శివసేన పార్టీ పేరు, గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీజ్‌ చేసింది

Shiv Sena: అసలైన పులి షిండేనే.. ఉద్ధవ్ థాకరేకు షాకిస్తూ శివసేనను షిండేకు కేటాయించిన ఈసీ

Uddhav Thackeray Loses Name, Symbol Of Shiv Sena Founded By Father

Shiv Sena: బాల్ థాకరే కుమారుడు, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రత్యర్థి, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానిదే అసలైన శివసేన అని భారత ఎన్నికల సంఘం గుర్తించింది. శివసేన ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్న ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’, జెండా షిండే వర్గానికే చెందుతుందని స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని శివసేనలో తిరుగుబాటు జరిగిన ఎనిమిది నెలల హైడ్రామా అనంతరం ఏక్‌నాథ్ షిండే వేసిన దావాకు అనుకూలంగా ఎన్నికల సంఘం తీర్పు వెలువడడం గమనార్హం. ఈ మేరకే ఈసీఐ త్రిసభ్య కమిషన్‌ శుక్రవారం 78 పేజీల ఆదేశాల్లో తిరుగుబాటు తర్వాత ముఖ్యమంత్రి అయిన షిండేకు 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ గెలిచిన ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, పార్టీ సాధించిన ఓట్లలో ఇది 76 శాతమని కమిషన్ పేర్కొంది. ఉద్ధవ్‌ వైపు 23.5శాతం మందే ఉన్నట్లు వెల్లడించింది.

Terrorist Attack Pakistan : పాకిస్తాన్ లో కరాచీ పోలీస్ హెడ్ క్వార్టర్ పై ఉగ్రదాడి.. తొమ్మిది మంది మృతి

గత ఏడాది జూన్‌లో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాఢీ(ఎంవీఏ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా షిండే తిరుగుబాటు బావుటా ఎగురేసి 40 పైచిలుకు ఎమ్మెల్యేలతో కలిసి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత.. ఉద్ధవ్‌, షిండే వర్గాల మధ్య అసలైన శివసేన ఎవరిదనే పోరు లేచింది. పార్టీ పేరు సహా పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే పేరును వాడుకోవడం, పార్టీ గుర్తు విషయంలో ఆధిపత్య పోరు మొదలైంది. ఆరు నెలల క్రితం తమ వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తించాలని, పార్టీ గుర్తు ‘విల్లు-బాణం’ తమకే కేటాయించాలని కోరుతూ ఉద్ధవ్‌ ఠాక్రే ఈసీఐకి విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం త్రిసభ్య కమిషన్‌ ఏర్పాటైంది.

Maha Shivaratri 2023: శివోహం.. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు.. Live Updates

ఉద్ధవ్‌, షిండే వర్గాల వాదోపవాదాలు, ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకుని, శుక్రవారం తుది ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. షిండే వర్గానిదే అసలైన శివసేన అని ఆ ఆదేశాల్లో ప్రకటించింది. ఆరు నెలల క్రితం కమిషన్‌ ఏర్పడగానే 1996లో ఏర్పడ్డ శివసేన పార్టీ పేరు, గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీజ్‌ చేసింది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఉద్ధవ్‌ వర్గానికి శివసేన(ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే) పార్టీ పేరును, ఎన్నికల గుర్తుగా వెలుగుతున్న కాగడను కేటాయించింది. ఇక షిండే వర్గానికి ‘బాలాసాహెబ్‌ అంచి శివసేన’ పేరును, ఎన్నికల గుర్తుగా రెండు కత్తులతో ఉన్న డాలును కేటాయించింది.

KTR Son Himanshu Song : కొడుకు పాటకు కేటీఆర్ ఫిదా.. గర్వంగా ఉందని కితాబు

శుక్రవారం నాటి ఆదేశాల నేపథ్యంలో ఉద్ధవ్‌ వర్గానికి ఈ నెల 27న జరగనున్న ఉప ఎన్నికల వరకు ఆరు నెలల క్రితం కేటాయించిన పార్టీ పేరు, గుర్తులు కొనసాగుతాయని త్రిసభ్య కమిషన్‌ స్పష్టం చేసింది. షిండే వర్గానికి కేటాయించిన పార్టీ పేరు, గుర్తు తక్షణం రద్దవుతాయని, ఇకపై శివసేన పేరును, విల్లు-బాణం గుర్తును ఉపయోగించుకోవొచ్చని పేర్కొంది. ఈసీఐ నిర్ణయాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే స్వాగతించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ‘‘బాలాసాహెబ్‌కు దక్కిన గౌరవం ఇది. ఆయన ఆశయాలతో ముందుకు సాగుతున్నాం. మాదే నిజమైన శివసేన’’ అని అన్నారు.

Elderly Couple Viral pics: ఫొటోకు వృద్ధ దంపతుల పోజులు.. అబ్బురపరుస్తున్న ఫొటోలు

ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై ఉద్ధవ్ థాక్రే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయం ప్రజాస్వామ్యం పాలిట ప్రమాదకరమని ఆక్రోశం వ్యక్తం చేశారు. ‘‘వారు (ఏక్‌నాథ్‌ శిందే) మా విల్లు-బాణాన్ని తస్కరించారు. కానీ ప్రజలు వారికి గుణపాఠం చెబుతారు. అందుకు తగిన ప్రతీకారం తీర్చుకుంటారు. ఈసీ నిర్ణయంతో భారత్‌లో ప్రజాస్వామ్యం లేదని నిరూపితమైంది’’ అని అన్నారు. ఈసీఐ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామన్నారు. ఎంపీసంజయ్‌ రౌత్‌ ఈసీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈసీ ఆదేశాలను ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం’గా అభివర్ణించారు.