వైసీపీ గెలిస్తే : భూములు లాక్కుంటారని, రౌడీలు కత్తులతో తిరుగుతారని భయపెట్టారు

ఏపీ సీఎం చంద్రబాబు పై వైసీపీ నేత విజయసాయి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన దుర్మార్గపు ఆరోపణలు అన్నీ ఇన్నీ కావన్నారు.

  • Published By: veegamteam ,Published On : April 29, 2019 / 01:42 PM IST
వైసీపీ గెలిస్తే : భూములు లాక్కుంటారని, రౌడీలు కత్తులతో తిరుగుతారని భయపెట్టారు

ఏపీ సీఎం చంద్రబాబు పై వైసీపీ నేత విజయసాయి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన దుర్మార్గపు ఆరోపణలు అన్నీ ఇన్నీ కావన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు పై వైసీపీ నేత విజయసాయి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన దుర్మార్గపు ఆరోపణలు అన్నీ ఇన్నీ కావన్నారు. వైసీపీ గెలిస్తే భూములు లాక్కుంటారని, ఇళ్ల నుంచి వెళ్లగొడతారని, రౌడీలు కత్తులు పట్టుకుని తిరుగుతారని చెప్పి.. ప్రజలను చంద్రబాబు భయపెట్టారని విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇంతలా దిగజారడం ఎక్కడైనా ఉందా? అని ట్విట్టర్ లో ప్రశ్నించారు. టీడీపీ నేతలు అవినీతి, అక్రమార్జనే ఆక్సిజన్ గా బతుకున్నారని అన్నారు. చంద్రబాబు.. అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయించారని అన్నారు. మే 23 తర్వాత టీడీపీ నేతల బతుకులు రోడ్డున పడతాయన్నారు. ఐదేళ్లలో మేసింది అంతా వడ్డీతో సహా కక్కిస్తామని విజయసాయి రెడ్డి చెప్పారు.
Also Read : నుబియా Red Magic 3 : ఈ స్మార్ట్ ఫోన్లలో కూలింగ్ ఫ్యాన్

ఏపీ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు కుటుంబరావుపైనా విజయసాయి రెడ్డి మండిపడ్డారు. స్వైన్ ఫ్లూ మాదిరిగా చంద్రబాబు వైరస్‌ను వ్యాప్తిచేసే గుంపులో కుటుంబరావు ఒకరు అని విమర్శించారు. అవినీతి, అక్రమార్జనే ఆక్సిజన్‌గా బతికే సమూహాలు మీరంతా అని తిట్టారు. కొంతకాలంగా ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి.. సీఎం చంద్రబాబుని, టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలు ముగిసినా ఏపీలో రాజకీయ వేడి మాత్రం కంటిన్యూ అవుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి.

Also Read : బ్రాండ్ అంటే ఇదే : హైదరాబాద్ ఐటీ ఎగుమతులు లక్ష కోట్లు