కరోనా వల్లే ప్రచారానికి దూరం.. విజయశాంతి కాంగ్రెస్‌లోనే ఉంటారు : కుసుమ

  • Published By: sreehari ,Published On : October 28, 2020 / 06:42 PM IST
కరోనా వల్లే ప్రచారానికి దూరం.. విజయశాంతి కాంగ్రెస్‌లోనే ఉంటారు : కుసుమ

Vijaya Shanthi : కాంగ్రెస్ నేత విజయశాంతి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ కొట్టిపారేశారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.



కరోనా వల్లే ఎన్నికల ప్రచారానికి విజయశాంతి దూరంగా ఉన్నారని అన్నారు. కరోనా వల్లే కొత్త ఇంచార్జ్‌ను కలవలేకపోయినట్టు విజయశాంతి చెప్పారని కుసుమ వెల్లడించారు.



బుధవారం (అక్టోబర్ 28) విజయశాంతితో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ భేటీ అయ్యారు.



ఈ భేటీ అనంతరం విజయశాంతి కాంగ్రెస్ లోనే కొనసాగుతారని కుసుమ క్లారిటీ ఇచ్చారు. విజయశాంతి పార్టీ మారుతారనేది ప్రచారం మాత్రమేనని కుసుమ అన్నారు.