జాగ్రత్త పడండి : 24 గంటలు నీటి సరఫరా బంద్..ఎక్కడంటే

  • Published By: madhu ,Published On : January 27, 2020 / 01:55 AM IST
జాగ్రత్త పడండి : 24 గంటలు నీటి సరఫరా బంద్..ఎక్కడంటే

గ్రేటర్ పరిధిలో రెండు రోజుల పాటు నీటి సరఫరా ఉండదని జలమండలి అధికారులు వెల్లడించారు. కృష్ణా ఫేజ్ – 1 పైపులైన్ పనుల్లో తలెత్తిన లీకేజ్‌లను అరికట్టేందుకు పనులు చేపట్టడం జరుగుతోందని దీనికారణంగా 2020, జనవరి 29వ తేదీ ఉదయం 06 గంటల నుంచి జనవరి 30 తేదీ ఉదయం 06 గంటల వరకు నీటి సరఫరా ఉండదని తెలిపారు. 

నీటి సరఫరా జరగని ప్రాంతాలు : – 
మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, అల్వాల్, సైనిక్ పురి, లాలాపేట, స్నేహపురి కాలనీ, కైలాసగిరి, బండ్లగూడ, ‌ఋద్వేల్, సులేమాన్ నగర్, హైదర్ గూడ, గోల్డెన్ హైట్స్, గంధం గూడ, సాహెబ్ నగర్, ఆటోనగర్, నార్సింగ్, బోడుప్పల్, చెంగిచర్ల, ఫీర్జాదీగూడ, వైశాలీనగర్,

మీర్ పేట, జల్‌పల్లి, మైలార్ దేవ్ పల్లి, శాస్త్రిపురం, ఆళ్లబండ, భోజగుట్ట, ఆసీఫ్ నగర్, రెడ్ హిల్స్, షేక్ పేట, ప్రశాసన్ నగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు ప్రకటించారు.

Read More :  సమత కేసు..న్యాయం జరిగేనా..తీర్పుపై ఉత్కంఠ