ప్రాణం ఉన్నంత వరకు జగన్ తోనే..

సుజనా చౌదరి వ్యాఖ్యలకు వైసీపీ ఘాటుగా కౌంటర్లు ఇచ్చింది. బీజేపీతో టచ్ లో ఉన్న ఎంపీల పేర్లు బయటపెట్టాలని సుజనాకు సవాల్ విపిరారు.

  • Published By: veegamteam ,Published On : November 22, 2019 / 11:23 AM IST
ప్రాణం ఉన్నంత వరకు జగన్ తోనే..

సుజనా చౌదరి వ్యాఖ్యలకు వైసీపీ ఘాటుగా కౌంటర్లు ఇచ్చింది. బీజేపీతో టచ్ లో ఉన్న ఎంపీల పేర్లు బయటపెట్టాలని సుజనాకు సవాల్ విపిరారు.

సుజనా చౌదరి వ్యాఖ్యలకు వైసీపీ ఘాటుగా కౌంటర్లు ఇచ్చింది. ఏపీ మంత్రులు, ఎంపీలు తీవ్రంగా స్పందించారు. బీజేపీతో టచ్ లో ఉన్న ఎంపీల పేర్లు బయటపెట్టాలని సుజనాకు సవాల్ విపిరారు. సుజనా చౌదరి చంద్రబాబు కోవర్ట్ అంటూ ఎంపీలు విమర్శలు చేశారు. బీజేపీలో ఉంటూ టీడీపీ ఏజెంట్ గా సుజనా మాట్లాడుతున్నారన్నాని విమర్శించారు. సుజనా చౌదరిని బ్యాంకు దొంగ అని చెప్పుకుంటున్నారని తెలిపారు. గూగుల్ సెర్చ్ చేస్తే బ్యాంకు దొంగ అని వస్తుందన్నారు. అసలు సుజనా ఒరిజినల్ బీజేపా, లేదా డుప్లికేట్ బీజేపా అర్థం కాని పరిస్థితి అన్నారు. తమ ప్రాణం ఉన్నంత వరకు జగన్ తోనే ఉంటామన్నారు.  

బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి సుజనా చౌదరి బీజేపీలో చేరారని రోజా విమర్శించారు. సుజనా ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదన్నారు. పార్టీ మారాల్సిన అవసరం ఏ ఒక్క వైసీపీ నేతకు లేదన్నారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నామ రూపాలు లేకుండా పోయిందో జైలుకు వెళ్లడం తథ్యమని తెలుసుకున్న సుజనా.. బీజేపీ వాళ్ల కాళ్లు పట్టుకుని ఆ పార్టీలో చేరారని విమర్శించారు. సుజనా చౌదరిలాగే అందరూ ఉంటారని అనుకోవడం పొరపాటన్నారు. ఆయన లాగా అందరూ బరితెంగిచారు, తప్పులు చేశారని లేదా ఆ తప్పుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరుతారన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబు నాయుడు లాంటి నీచ రాజకీయాలు చేసే నాయకుడిని ఎదుర్కొన్న వైసీపీ నాయకులకు… సుజనా చౌదరితో కలిసి ఇంకో పార్టీకి వెళ్లాల్సిన అసవరం లేదన్నారు. రాజశేఖర్ రెడ్డిని అభిమానించే ప్రతి వ్యక్తి, రాజశేఖర్ రెడ్డి ఆశయాలు నెరవేర్చే జగన్ వెనుక నడుస్తామని తెలిపారు. తాము పడాల్సిన కష్టాలన్నీ పడ్డామన్నారు. ఎన్నో అవమానాలు, తప్పుడు కేసులు ఎదుర్కొన్నామని తెలిపారు. టీడీపీతో సుజనా చౌదరి ఎందుకు టచ్ లో ఉన్నారని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.