చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ట్వీట్లు

  • Published By: chvmurthy ,Published On : May 8, 2019 / 07:38 AM IST
చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ట్వీట్లు

అమరావతి: వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ట్వీట్ లతో దాడి చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు మెంటల్ బ్యాలన్స్ కోల్పోయాడని, అన్ని వివి ప్యాట్ స్లిప్పులను లెక్కించడం సాధ్యం కాదని కిందటి సారే సుప్రీం తేల్చి చెప్పిందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. కోర్టు తీర్పును తప్పు పట్టేలా చంద్రబాబు నాయుడు మాట్లాడాడని ఆయన బుధవారం ట్వీట్ చేశారు. మళ్లీ సుప్రీంలో రివ్యూకు వెళ్తే కర్ర కాల్చి వాత పెట్టిందని వ్యాఖ్యానించారు. 40 ఏళ్లలో చంద్రబాబు స్వార్థం తప్ప హుందాతనాన్ని అలవర్చుకోలేదని ఎద్దేవా చేశారు.

” వీవీప్యాట్లను ఎలక్షన్‌ కమిషన్‌ 2014లో ప్రయోగాత్మకంగా 8 లోక్‌సభ స్థానాల్లో ఏర్పాటు చేసింది. ఈసారి దేశవ్యాప్తంగా పెట్టింది. ఈవీఎంలకు ఇది అదనంగా అమర్చిన ఏర్పాటే తప్ప కౌంటింగ్ కోసం కాదని ఈసీ చెబుతోంది. అయినా కొన్నిటిని లెక్కిస్తామని చెప్పినా రాద్దాంతం చేయడం, ఆడలేక మద్దెల ఓడు అనడటమే.” అని తన ట్వీట్ లో పేర్కోన్నారు. 2003లో ముందస్తు ఎన్నికలకు వెళ్దామని పోరు పెట్టి వాజ్‌పేయి ప్రభుత్వాన్ని 6 నెలల ముందే దిగిపోయేట్టు చంద్రబాబు చేశారు. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలని సుప్రీంలో 21 పార్టీలతో రివ్యూ పిటిషన్‌ వేయించి వాళ్ల పరువు తీశారు. మీ మేనిప్యులేషన్లకు కాలం చెల్లింది చంద్రబాబూ అంటూ విజయసాయి రెడ్డి తన తాజా ట్వీట్ లో వ్యాఖ్యానించారు.