మీతో టచ్ లో ఉన్న వైసీపీ ఎంపీలు ఎవరో చెప్పండి : డబ్బు ఎగ్గొట్టి బీజేపీలో చేరారు

20మంది వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని, తమతో సంప్రదింపులు జరుపుతున్నారని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఘాటుగా

  • Published By: veegamteam ,Published On : November 22, 2019 / 09:15 AM IST
మీతో టచ్ లో ఉన్న వైసీపీ ఎంపీలు ఎవరో చెప్పండి : డబ్బు ఎగ్గొట్టి బీజేపీలో చేరారు

20మంది వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని, తమతో సంప్రదింపులు జరుపుతున్నారని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఘాటుగా

20మంది వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని, తమతో సంప్రదింపులు జరుపుతున్నారని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సుజనా చౌదరిపై తీవ్ర విమర్శలు చేస్తూ నిలదీశారు. బీజేపీతో టచ్ లో ఉన్న వైసీపీ ఎంపీలు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు సుజనా చౌదరి బీజేపీలో ఉన్నారో లేక టీడీపీలో ఉన్నారో చెప్పాలన్నారు. బీజేపీలో ఉంటూ టీడీపీ నేతలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి బీజేపీలో చేరారని సుజనాపై విమర్శలు చేశారు. వైసీపీ తలుపు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుందని హెచ్చరించారు.

ఇంగ్లీష్ మీడియం వివాదంపైనా ఎంపీలు స్పందించారు. ప్రతిపక్షాల విమర్శలను ఖండించారు. పేదల పిల్లలు బాగుపడాలని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే.. అనవసర రాద్దాంతం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ఇంగ్లీష్ ఉంటే ఉద్యోగం, ఉపాధి లభిస్తాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దా అని ప్రశ్నించారు. మాతృభాష పేరుతో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించడం అనాగరికం అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రజలను బానిసలుగా చూస్తే.. జగన్ ప్రభుత్వం ప్రజలను బాగు చేసేందుకు పని చేస్తోందన్నారు.

సుజనా చౌదరి తెరచాటు రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. సుజనా చౌదరి కాల్ డేటా బయటపెడితే అసలు విషయం వెలుగులోకి వస్తుందన్నారు. చంద్రబాబుని కాపాడేలా సుజనా చౌదరి వ్యవహరించకూడదన్నారు. సుజనా చౌదరి వైసీపీ ఎంపీల గురించి ఆలోచించడం మాని.. కేసుల విచారణ జరిగితే జైలుకి వెళ్లకుండా ఉండేందుకు ఏం చేయాలో ఆలోచించుకోవాలని హితవు పలికారు.