Home » International » గాలిలో నుంచి నీరు పుట్టిస్తున్న సింగపూర్ యూనివర్సిటీ రీసెర్చర్లు
Updated On - 4:34 pm, Sat, 23 January 21
Air into Water: నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ రీసెర్చర్లు ఎటువంటి బాహ్యబలం ఉపయోగించకుండా గాలి నుంచి నీటిని పుట్టిస్తున్నారు. సైన్స్ అడ్వాన్సెస్ లో ఈ స్టడీ పబ్లిష్ అయింది. సింగపూర్ యూనివర్సిటీ స్పాంజ్ లా పనిచేసే అల్ట్రా లైట్ ఏరో జెల్ రెడీ చేసింది. ఇది బ్యాటరీ లేకుండా పనిచేయడంతో పాటు గాలి నుంచి నీటిని శోషించుకోగలదు. అలా అని నీరు రావడం కోసం దానిని పిండేయకూడదు.
ఈ స్టడీ ప్రకారం.. ఒక కేజీ ఏరోజెల్ సాయంతో 17లీటర్ల నీరు ఉత్పత్తి చేయగలం. దీనిని పాలీమర్లతో తయారుచేశారు. ఈ పాలీమర్లే గాలి నుంచి నీటిని శోషించుకుంటుందని స్టడీ చెప్తుంది. అలా చేసి లిక్విడ్ రూపంలోకి మారుస్తుంది. నీరు రూపంలో బయటకు పంపిస్తుంది.
వేడిగా ఉన్న రోజు.. ఏరో జెల్ చాలా వేగంగా పనిచేస్తుంది. 95శాతం నీటి ఆవిరిని లిక్విడ్ వాటర్ గా మారుస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాటర్ స్టాండర్డ్స్ ప్రకారం.. ఈ నీరు తాగేందుకు ఉపయోగపడుతుందని రీసెర్చర్లు చెబుతున్నారు.
హైడ్రలాజికల్ సైకిల్ ద్వారా వాతావరణంలోని నీరు కంటిన్యూస్ గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. పలు వాతావరణ పరిస్థితుల మధ్య కూడా దీనిని చాలా తక్కువ ఖర్చుతో రెడీ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రొఫెసర్ హో ఘీమ్ వీ అంటున్నారు.
కళ్లద్దాలు ధరించేవారిలో కరోనా వచ్చే అవకాశాలు మూడింతలు తక్కువ : కొత్త అధ్యయనం
బట్టతల మాయం చేయడానికి అద్భుతమైన టెక్నిక్ కనిపెట్టిన రీసెర్చర్స్
ప్రపంచవ్యాప్తంగా 4వేల కొవిడ్ రకాలున్నాయంటోన్న రీసెర్చర్లు
షాకింగ్.. బ్రెజిల్లో ఒకే వ్యక్తిలో రెండు రకాల కరోనా వైరస్లు
ఐఐటీ గౌహతి ఘనత…గాలి నుంచి నీరు తయారీ
పురుషులకు మాత్రమే వచ్చే కొత్త వ్యాధి…