Updated On - 12:58 pm, Fri, 22 January 21
Rising petrol and diesel prices again : పెట్రోల్, డీజీల్ ధరలు రోజురోజుకూ చుక్కలనంటుతున్నాయి. ఇప్పటికే గరిష్టస్థాయికి చేరిన ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజల్పై చమురు సంస్థలు మరో 25 పైసలు వడ్డించాయి. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. వారం వ్యవధిలో రూపాయిన్నర మేర పెట్రోల్, డీజిల్ ధర పెరగడంతో వాహనదారులు మండిపడుతున్నారు.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 85.45 రూపాయలు, డీజిల్ ధర 75.63 గా ఉంది. ముంబై, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 90 రూపాయలు దాటింది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర 92 రూపాయల 4 పైసలు, డీజిల్ ధర 82 రూపాయల 40 పైసలు, విజయవాడలో లీటరు పెట్రోల్ ధర 91.37 రూపాయలు, డీజిల్ 84.53 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 88.89 రూపాయలుగా ఉంది.
ముంబై బ్లాకౌట్పై స్పందించిన కేంద్రం : చైనా సైబర్ దాడులు చేసినట్లు ఆధారాలు లేవన్న కేంద్ర మంత్రి ఆర్కే సింగ్
భారీగా తగ్గిన బంగారం ధర
హైదరాబాద్లో దారుణం : మూడేళ్ల బాలుడిని చంపేసిన పెద్దమ్మ..తనకు సంతానం కల్గలేదనే అక్కసుతో హత్య
గాంధీ ఆస్పత్రిలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కు ఏర్పాట్లు : మంత్రి ఈటల
‘భీష్మ’ డైరెక్టర్కి బొమ్మ చూపించాడుగా..
చూడకుండానే..రూబిక్ క్యూబ్ సాల్వ్ చేశాడు, సచిన్ ఫిదా..వీడియో వైరల్