Tirumala : వసంతమండపంలో ” అరణ్యకాండ పారాయణ దీక్ష ” ప్రారంభం
తిరుమల వసంత మండపంలో అరణ్యకాండ పారాయణ దీక్ష శనివారం ప్రారంభమైంది. జూలై 10వ తేదీ వరకు ఈ పారాయణం జరుగుతుంది.
Tirumala : శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని, సకల కార్యాలు సిద్ధించాలని కోరుతూ తిరుమల వసంత మండపంలో అరణ్యకాండ పారాయణ దీక్ష శనివారం ప్రారంభమైంది. జూలై 10వ తేదీ వరకు ఈ పారాయణం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం టీటీడీ షోడశదిన సుందరకాండ దీక్ష, అఖండ సుందరకాండ పారాయణం, బాలకాండ, అయోధ్యకాండ, యుద్ధకాండ పారాయణం నిర్వహించినట్లు చెప్పారు. శ్రీమద్రామాయణ పారాయణం ఒక జ్ఞానయజ్ఞమన్నారు. వేదస్వరూపమైన రామాయణ పారాయణం ద్వారా భక్తి, జ్ఞానం, వైరాగ్యం, చిత్తశుద్ధి కలుగుతాయని, వీటి ద్వారా మోక్షం లభిస్తుందన్నారు.
Also Read : Vijayawada : రేపటి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోగాకు నిషేధం