CM KCR : రేపు యాదాద్రికి కేసీఆర్…. ఆలయ పునః ప్రారంభం తేదీ ప్రకటించే అవకాశం
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంగళవారం యాదాద్రి సందర్శించనున్నారు.
CM KCR : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంగళవారం యాదాద్రి సందర్శించనున్నారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులు పూర్తయినందున అన్నిటినీ మరోసారి ఆయన పరిశీలిస్తారు. ఉదయం గం.11-30 కి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆయన యాదాద్రి చేరుకుంటారు.
పనులను పరిశీలించిన అనంతరం ఆలయ పునః ప్రారంభ తేదీని అక్కడే ప్రకటించే అవకాశం ఉంది. ఆలయ పునః ప్రారంభానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజియ్యర్ స్వామి ఇప్పటికే ముహుర్తం ఖరారు చేశారు.
ఆలయం పున: ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా సిఎం కేసీఆర్ ప్రకటించనున్నారు.