CM KCR : ముగియనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు..

ఈనెల 2 నుంచి అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి రోజు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ముచ్చింతల్ లో...

CM KCR : ముగియనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు..

Kcr

Muchintal Ashram : ముచ్చింతల్‌లో శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. 2022, ఫిబ్రవరి 14వ తేదీ సోమవారం సాయంత్రంతో ఈ కార్యక్రమాలు ముగియనున్నాయి. సాయంత్రం ఐదు గంటలకు జరిగే 108 దివ్య దేశాల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేశారు. అయితే రుత్విజుల సన్మాన కార్యక్రమం, ఇతరత్రా ఉండడంతో కల్యాణోత్సవం వాయిదా వేస్తున్నట్లు చిన్న జీయర్ ప్రకటించారు. దీంతో సీఎం పర్యటన వాయిదా పడింది.

Read More : Fire Accident: విశాఖలో భారీ అగ్ని ప్రమాదం

ఈనెల 2 నుంచి అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి రోజు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ముచ్చింతల్ లోని శ్రీరామనగరం అధ్యాత్మక వాతావరణంలో మునిగిపోయింది. ఫిబ్రవరి 02వ తేదీ 261 సువర్ణ సమతామూర్తిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోకార్పణం చేసిన సంగతి తెలిసిదే. ఇక సోమవారం ముగింపులో భాగంగా… యాగశాలల వద్ద మహా పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం 108 దివ్యదేశాల దేవతామూర్తులకు శాంతికల్యాణం నిర్వహిస్తారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ పర్యవేక్షణలో రామానుజాచార్యుల సువర్ణమూర్తికి ప్రాణప్రతిష్ట, కుంభాభిషేకం చేశారు. 2022, ఫిబ్రవరి 14వ తేదీ సోమవారం దివ్యదేశాల సందర్శనకు సాధారణ భక్తులను కూడా అనుమతించనున్నారు.

Read More : Hyderabad Parks : ప్రేమ జంటలకు షాక్.. పార్కులు క్లోజ్

సమతామూర్తి కేంద్రంలోని భద్రవేది అంతస్తులో 54 అడుగుల ఎత్తులో దీనిని కొలువుదీర్చారు. ఈ అంతస్తును శరణాగత మండపంగా పిలుస్తారు. విగ్రహాన్ని పూర్తిగా ముచ్చింతల్ లోనే జీవా ఆశ్రమంలోనే తయారు చేశారు. ఎందరో భక్తులు ఇచ్చిన విరాళాలతో 54 అంగుళాల సువర్ణ ప్రతిమను రూపొందించారు. విగ్రహం వెనుక ఉండే మకరతోరణాన్ని వెండితో తయారు చేయించారు. ఆదివారం శ్రీ భగవత్ రామానుజాచార్యుల 120 కిలోల స్వర్ణమూర్తిని లోకార్పణం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. స్వర్ణమూర్తికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ సతీమణి సవితా కోవింద్‌తో కలిసి తొలిపూజ చేశారు. రాష్ట్రపతి కుటుంబానికి 120 కేజీల సువర్ణమూర్తి విశిష్టతలను వివరించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి. 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. రాష్ట్రపతి దంపతులకు రామానుజాచార్యుల ప్రతిమను బహూకరించి సత్కరించారు త్రిదండి చిన్నజీయర్‌స్వామి, మైహోంగ్రూప్‌ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు.