Sriramanavami : శ్రీరామ శోభాయాత్ర.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు

శోభాయాత్ర సీతారాం బాగ్ టెంపుల్, బోయిగూడ క‌మాన్, గాంధీ విగ్రహం, బేగంబ‌జార్, సిద్ధంబ‌ర్ బ‌జార్, శంక‌ర్‌షేర్ హోట‌ల్, గౌలిగూడ‌, పుత్లీబౌలి ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా...

Sriramanavami : శ్రీరామ శోభాయాత్ర.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు

Srirama

Sri Rama Shobha Yatra : శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌లో శ్రీరామ శోభాయాత్ర నిర్వహించనుంది భాగ్యన‌గ‌ర్ శ్రీరామ‌న‌వ‌మి ఉత్సవ స‌మితి. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. సీతారాంబాగ్ ద్రౌప‌ది గార్డెన్స్ నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు శోభాయాత్ర మొద‌లవుంది.. రాత్రి 8 గంట‌ల‌కు సుల్తాన్ బ‌జార్ చేరుకోనుంది. శోభాయాత్ర సీతారాం బాగ్ టెంపుల్, బోయిగూడ క‌మాన్, గాంధీ విగ్రహం, బేగంబ‌జార్, సిద్ధంబ‌ర్ బ‌జార్, శంక‌ర్‌షేర్ హోట‌ల్, గౌలిగూడ‌, పుత్లీబౌలి ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బ‌జార్ చేరుకోనుంది. ఈ మార్గాల్లో వెళ్లే వాహ‌న‌దారులు ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాల‌ని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వాహ‌న‌దారులు స‌హ‌క‌రించాల‌ని కోరారు. మల్లేపల్లి జంక్షన్, బోయిగూడ కమాన్, ఆఘపురాజంక్షన్, పురానాపూల్ ఎక్స్ రోడ్, ముస్లింజంగ్ బ్రిడ్జి, అలస్కా టీ జంక్షన్, లేబర్ అడ్డా, రంగ మహల్ జంన్, ఫుత్లీబౌలీ ఎక్స్ రోడ్, ఆంధ్రా బ్యాంకు జంక్షన్, డీఎం అండ్ హెచ్ఎస్ జంక్షన్, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ ను మళ్లించనున్నారు.

Read More : Ram Navami 2022 : రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

హైదరాబాద్, భైంసాలో శ్రీరామనవమి శోభాయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రను హైదరాబాద్‌, భైంసాలో పోలీసుల మార్గదర్శకాల మేరకు నిర్వహించాలని కోర్టు స్పష్టం చేసింది. అనుమతిచ్చిన వీధుల్లోనే శోభాయాత్ర జరపాలని నిర్వాహకులకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైదరాబాద్‌, నిర్మల్‌ జిల్లా భైంసాలో కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో శోభాయాత్రకు అనుమతించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరపగా.. శాంతిభద్రతలు దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రాంతాలు, వీధుల్లో శోభాయాత్రకు అనుమతిచ్చినట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.