Tirumala : మెట్టు మార్గం త్వరలో రెడీ.. భక్తులకు అనుమతి ఎప్పటి నుంచి అంటే

శ్రీవారి మెట్టు మార్గానికి టీటీడీ రిపేర్లు పూర్తి చేసింది. వచ్చే నెల మొదటి వారంలో మెట్టు మార్గాన్ని పునఃప్రారంభించి.. ఆ మార్గంలో భక్తులను అనుమతించాలని నిర్ణయించినట్లు...

Tirumala : మెట్టు మార్గం త్వరలో రెడీ.. భక్తులకు అనుమతి ఎప్పటి నుంచి అంటే

Tirumala Srivari Mettu Margam Rain

Srivari Mettu Margam : శ్రీవారి మెట్టు మార్గానికి టీటీడీ రిపేర్లు పూర్తి చేసింది. వచ్చే నెల మొదటి వారంలో మెట్టు మార్గాన్ని పునఃప్రారంభించి.. ఆ మార్గంలో భక్తులను అనుమతించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. మరోవైపు మే 5న ముఖ్యమంత్రి జగన్‌ తిరుపతిలో పర్యటించనున్నారు. టాటా క్యాన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు పద్మావతి మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్స్‌ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేస్తారనన్నారు వైవీ సుబ్బారెడ్డి. 2021 నవంబర్ లో భారీగా కురిసిన వర్షాలకు శ్రీవారి మెట్లు మార్గం ధ్వంసమైంది. అప్పటి నుంచి భక్తుల రాకపోకలను నిలిపివేసింది టీటీడీ. శ్రీవారి మెట్టు మార్గాన్ని ఐదు నెలల నుంచి టీటీడీ మూసివేసింది.

Read More : Tirumala : తిరుమలలో తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం నిర్మాణానికి భూమిపూజ

ప్రస్తుతం అలిపిరి నడక మార్గం ద్వారానే కొండపైకి వెళుతున్నారు భక్తులు. మెట్టు మార్గం ప్రారంభమైతే భక్తులు ఎక్కువ సంఖ్యలో నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకోవచ్చు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అటు తిరుమల శ్రీవారిని నిన్న 64 వేల 380 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 31 వేల 204 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.34 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.