Tirumala Tickets : ఈ నెల 24న తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారిని జనవరి నెలలో దర్శించుకునేందుకు ఈనెల 24 ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల చెయ్యనుంది.
Tirumala Tickets : తిరుమల శ్రీవారిని జనవరి నెలలో దర్శించుకునేందుకు ఈనెల 24 ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చెయ్యనుంది. రోజుకి 20 వేల చొప్పున 6 లక్షల 20 వేల టికెట్లను టీటీడీ విడుదల చెస్తోంది.
జనవరి నెలకు సంభందించి సర్వదర్శనం టోకెన్లు 5 వేలు ఆఫ్ లైన్లో…..5 వేలు ఆన్లైన్లో టీటీడీ విడుదల చెయ్యనుంది. 25వ తేది ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చెయ్యనుంది. రోజుకి 5 వేలు చొప్పున లక్షా 55 వేల టోకెన్లు విడుదల చేస్తోంది.
Also Read : Young Man Hangs With Kite : గాలిపటంతో ఎగిరిన యువకుడు
జనవరి నెలకు సంభందించి రోజుకు 5 వేల టోకెన్లు తిరుపతిలో జారీ చెయ్యనున్నారు. కాగా ఈ నెల 31వ తేదీనుంచి టీటీడీ అధికారులు తిరుపతిలో ఆఫ్లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చెయ్యనున్నారు.