గోల్డ్ మెడల్ గోమతికి తమిళ పార్టీల సాయం

  • Published By: venkaiahnaidu ,Published On : April 30, 2019 / 09:10 AM IST
గోల్డ్ మెడల్ గోమతికి తమిళ పార్టీల సాయం

ఖతార్ లోని దోహాలో  గత వారం జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌ 2019లో మహిళల 800మీటర్ల పరుగు పందెంను 2నిమిషాల 70 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించిన తమిళనాడుకి చెందిన గోమతి మరిముత్తుకి AIADMK రూ.15లక్షల రివార్డ్ ను ప్రకటించింది.
Also Read : నేను మగాడినే నమ్మండి… ఆస్ట్రేలియా క్రికెటర్ ఆవేదన

అంతకుముందుకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ గోమతికి రూ.10లక్షల సాయం ప్రకటించగా, రాష్ట్ర కాంగ్రెస్ రూ.5లక్షలు ప్రకటించింది.పార్టీలు తనకు అండగా నిలబడటంపై గోమతి సంతోషం వ్యక్తం చేసింది.అనేక అంతర్జాతీయ వేదికల్లో పతకాలు సాధించి దేశానికి మంచి పేరుని తీసుకొస్తానని గోమతి విశ్వాసం వ్యక్తం చేసింది.