Anushka Sharma : 88 బంతుల్లో 52 పరుగులు చేసిన అనుష్క శర్మ.. నెటిజన్లు షాక్!

అనుష్క శర్మ.. 88 బంతుల్లో 52 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేసిందంటూ బీసీసీఐ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. ఇప్పుడా పోస్టు తెగ వైరల్ అవుతోంది.

Anushka Sharma : 88 బంతుల్లో 52 పరుగులు చేసిన అనుష్క శర్మ.. నెటిజన్లు షాక్!

Anushka Sharma Scores 52 Runs In 88 Balls. Internet Has The Best Response To Viral Post

Anushka Sharma score : అనుష్క శర్మ.. 88 బంతుల్లో 52 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేసిందంటూ బీసీసీఐ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. ఇప్పుడా పోస్టు తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టు చూసిన నెటిజన్లంతా బాలీవుడ్ నటి, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ క్రికెట్ ఆడిందా? ఏంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ ట్వీట్ చూసి పొరబడిన నెటిజన్లు.. అనుష్క.. సినిమాలో ఏదైనా క్రికెటర్ రోల్ లో నటిస్తున్నారా? లేదంటే సరదాగా క్రికెట్ ఆడారా? ఎక్కడా? అని తెగ వెతికేస్తున్నారు. వాస్తవానికి అనుష్క శర్మ ఏ క్రికెట్ ఆడలేదు. కనీసం సరదాగా కూడా ఆడలేదు.

అసలు ఆడింది.. విరాట్ సతీమణి అనుష్క శర్మ కాదు.. భారత మహిళల అండర్ 19 క్రికెటర్ అనుష్క శర్మ (BCCI Women). మహిళల వన్డే ఛాలెంజర్ ట్రోపీ 2021-22లో భాగంగా మంగళవారం మ్యాచ్ ప్రారంభమైంది. ఈ టోర్నీలో దేశీవాళీ మహిళా క్రికెటర్లను A, B, C, D ఇలా 4 గ్రూపు జట్లుగా విభజించారు. ప్రతి జట్టు రెండేసి మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. టాప్ రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ కు చేరుతాయి. నవంబర్ 2 నుంచి నవంబర్ 7వ తేదీ వరకు జరుగనుంది. ఇండియా బి గ్రూపు జట్టు తరపున అనుష్క బ్రిజ్మోహన్ శర్మ ఆడుతోంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ జరుగుతున్న సమయంలో BCCI Women ట్విటర్ అకౌంట్లో అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు చేసిందని ఇలా ట్వీట్ చేసింది.


అంతే.. ఈ ట్వీట్ చూడగానే నెటిజన్లు అవాక్కయ్యారు. అనుష్క శర్మ అని చూడగానే విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మగా అనుకున్నారంతా. కోహ్లీని విమర్శించేందుకే బీసీసీఐ ఇలా వెటకారంగా పోస్టు పెట్టిందేమోలే అనుకున్నారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ ట్వీట్లతో వైరల్ చేస్తున్నారు. నెటిజన్లు కోహ్లీని ఉద్దేశిస్తూ ఫన్నీ పోస్టులు, మీమ్స్ పెడుతున్నారు.అనుష్క శర్మ మ్యాచ్ ఆడేందుకు వెళ్లినట్టు నాకు ఎందుకు చెప్పలేదు. అక్కడ ఇంట్లో వామికా ఏడుస్తోంది.. కోహ్లీ అంటున్నట్లుగా మీమ్స్ వైరల్ చేశారు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ వరుస వైఫల్యాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుష్క శర్మపై నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది.
Read Also :  Raviteja 71 : ‘టైగర్ నాగేశ్వరరావు’ గా మాస్ మహారాజా!